తెలంగాణలో సంక్షేమం పరిఢవిల్లుతున్నది. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. పక్షపాతం లేకుండా ఎన్నో పథకాలు అమలు చేస్తూ ప్రజలకు బాంధవుడిగా నిలిచారు. ఎన్నో పథకాలు దేశవ్యాప్తంగా గుర్తింపుతో మెరవగా.. లబ్ధిపొందిన వారు మురిసిపోతున్నారు. కల్యాణలక్ష్మితో పేదింటి ఆడబిడ్డలు ఉన్న ఇండ్లల్లో పెండ్లిబాజాలు మోగుతుండగా.. మస్క బారిన కండ్లల్లో కంటివెలుగులు ప్రసరిస్తున్నాయి. రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్ కర్షకుల కుటుంబానికి ఆర్థిక భరోసానిస్తుండగా.. గొల్లకురుమలకు గొర్రెల పంపిణీ అండగా నిలిచింది. గర్భిణులకు అమ్మఒడి నుంచి పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్, రక్తహీనతను అరికట్టేందుకు మహిళలకు న్యూట్రిషన్ కిట్.. ఇలా ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనిస్తున్నది. పుట్టినప్పటి నుంచి చదువు, ఉపాధినిస్తూ ఆపత్కాలంలో అండగా నిలుస్తూ ఆఖరి మజిలీ వరకు పథకాలు అందుకున్న పేదల కండ్లల్లో ఆనందం తాండవిస్తున్నది. వలసలు నిలిచి ఉన్న ఊళ్లల్లోనే ఎందరో ఉపాధి పొందు తున్నారు. కులమతాలు, రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారు లబ్ధిపొందుతున్నారు. అందుకే మన పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయి. ఈ పథకాలు పాలమూరు,నారాయణపేట జిల్లాలోనూ రూ.వేలాది కోట్లతో పేదలకు భరోసానిస్తున్నాయి.
– మహబూబ్నగర్/నారాయణపేట/జడ్చర్ల/మూసాపేట, మార్చి 17 (నమస్తే తెలంగాణ)
జడ్చర్ల, మార్చి 17: గొల్లకురుమలు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతోపాటు రాష్ట్రంలో మాంసం ఉత్పత్తులు పెంచడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 2017-18 సంవత్సరంలో మొదటి విడుతలో గొర్రెలను పంపిణీ చేశారు. ఆ సమయంలో ఒక్కో యూనిట్కు (20గొర్రెలు) ఒక పొట్టేలును ఇస్తున్నది. దాంతోపాటు వాటికి ఇన్సూరెన్స్, దాణా కూడా ఇచ్చారు. రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో ఈ పథకం అమలవుతున్నది. రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది. దీంతో తెలంగాణలోని కురుమ, యాదవులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరింది. ఈ పథకంలో 18ఏండ్లు పైబడిన వారిని అర్హులుగా గుర్తించి గొర్రెల యూనిట్లను అందిస్తున్నారు. ఇందుకు అర్హత పొందాలంటే గొర్రెల పెంపకందారుల సంఘంలో సభ్యత్వం తప్పనిసరిగా ఉండాలి.
గొర్రెలకు పశుగ్రాసం అందించడానికి 75శాతం సబ్సిడీపై ప్రభుత్వం గడ్డి విత్తనాలను అందిస్తున్నది. అయితే యూనిట్ ధర రూ.లక్షా 25వేలు ఉండగా ప్రస్తుతం అన్ని ధరలు దృష్ట్యా రూ.లక్షా 75వేలకు పెంచారు. మొదటి విడుతలో ఇచ్చిన వాటిలో గొర్రెల పెంపకందారుడు 25శాతం అనగా రూ.31,250 చెల్లిస్తే మిగతాది ప్రభుత్వం భరిస్తుంది. గొర్రెలను కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్,. మహారాష్ట్ర తదితర రాష్ర్టాల నుంచి గొర్రెలను తీసుకొచ్చి లబ్ధిదారులకు ఇస్తున్నారు. మొదటి విడుతలో ఇచ్చిన గొర్రెలు అభివృద్ధి చెంది పెంపకందారులకు మంచి లాభాలనిస్తున్నాయి. జడ్చర్ల నియోజకవర్గంలో మొదటి విడుతలో దాదాపు 4,137 గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. అందులో జడ్చర్ల మండలంలో 1,220, బాలానగర్ మండలంలో 476, నవాబ్పేటలో 1,310, మిడ్జిల్ మండలంలో 737, రాజాపూర్ మండలంలో 396 యూనిట్లను పంపిణీ చేశారు.
గొల్లకురుమలు ఆర్థికంగా ఎదిగేందుకే.. దళితులకు సువర్ణావకాశం
దళితులు ఎదగడానికి ఈ పథకం ఒక సువర్ణావకాశంగా చెప్పొచ్చు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సహకారంతో నేను మొదటి విడుతలోనే ఎంపికయ్యాను. రూ.10లక్షలు మంజూరు కాగా నేను ఎలక్ట్రికల్స్, ప్లంబింగ్ దుకాణం ప్రారంభించాను. వ్యాపారం మంచిగా నడుస్తున్నది. దళిత జాతి ఎదగడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. దళితులు ఈ పథకాన్ని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటే ఎంతో బాగుంటుంది.
పేటలో 44,407 ఆసరా పింఛన్లు
నారాయణ పేట, మార్చి 17 : ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులకు వెన్నుదన్నుగా నిలిచేదుంకు ఆసరా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు లబ్ధిపొందుతున్నారు. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కాంగ్రెస్ హయాంలో కేవలం 200 పింఛన్ ఇస్తేనే గొప్పగా చెప్పుకునేవారు. అలాంటింది తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆదే పింఛన్ను రూ.2,016, రూ.3,016 ఇస్తూ ఎన్నో కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నది. నారాయణపేట జిల్లాలోనే 44,407మంది పింఛన్ పొందుతున్నారు. ఇదివరకు 4,925మందికి పింఛన్లు రాగా అదనంగా 1,005మందికి పింఛన్ వస్తున్నది. నారాయణపేట మండలంలో 8,900మందికి తాజాగా 1,296మందికి పింఛన్ అందుతున్నది. దామరగిద్ద మండలంలో 7,019మందికి వస్తుండగా నూతనంగా మరో 1,395మందికి పింఛన్ అందుతున్నది. కోయిల్కొండ మండలంలో 6,366మందికి వస్తుండగా నూతనంగా 1,830మందికి, ధన్వాడ మండలంలో 5,100మందికి వస్తుండగా నూతనంగా 610 మందికి, మరికల్ మండలంలో 5,094మందికి వస్తుండగా నూతనంగా 969మందికి పలు రకాల పింఛన్లను ప్రభుత్వం అందిస్తున్నది.
దళితుల అభ్యున్నతే లక్ష్యంగా..
మూసాపేట, మార్చి 17 : దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ‘దళితబంధు’ ప థకం ప్రారంభించారు. ఒక్కో కుటుంబానికీ రూ. 10లక్షలు సబ్సిడీతో అందజేయాలని సంకల్పించా రు. ఈక్రమంలో దేవరకద్ర నియోజకవర్గం మూసాపేటలో మండలం సంకలమద్ది గ్రామాన్ని ఎంపిక చే శారు. ఆ గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెం కటేశ్వర్రెడ్డి ప్రత్యేక సమావేశమై అర్హులను ఎంపిక చేశారు. దేవరకద్ర నియోజకవర్గంతోపాటు చిన్నచింతకుంట, భూత్పూర్, మూసాపేట, అడ్డాకుల, కొత్తకోట, మదనాపూర్ మండలాలకు సంబంధించి ఇప్పటివరకు 100 కుటుంబాలను ఎంపిక చే సి ట్రాక్టర్లు, జే సీబీలు, కార్లు, వరికోత మిషన్లు, గేదెలు, టెంట్హౌజ్లు, వస్త్ర దుకాణాలు, బేకరీలు, తదిత ర వ్యాపార సముదాయలకు ఆర్థిక స హాయం అందజేశారు. మొత్తంగా రూ. 10కోట్లు పూర్తి సబ్సిడీతో అందజేశా రు. అదేవిధంగా మరో 500 యూనిట్లకు ప్రతిపాదించిన ట్లు ఎమ్మెల్యే ఆల
తెలిపారు.
ఎనిమిదేండ్లలో రూ.249కోట్లు పంపిణీ
మహబూబ్నగర్, మార్చి 17 : పేదల ఇండ్లల్లో ఆడబిడ్డల పెండ్లిళ్లకు ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంతో మరింత ధైర్యం చేకూరుతున్నది. ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఎన్నో ఇబ్బందుల మధ్య ఆడబిడ్డల పెండ్లిళ్లు జరిగేవి. ఆడబిడ్డను భారంగా అనుకునే రోజుల నుంచి ఆడబిడ్డతోనే భవిష్యత్తు అనే విధంగా సీఎం కేసీఆర్ ఈ పథకాలను ప్రవేశపెట్టారు. ఎనిమిదేండ్లుగా 22,933మందికి కల్యాణలక్ష్మి ద్వారా రూ.209కోట్లు అందాయి. షాదీముబారక్ ద్వారా 4,640మందికి రూ.41కోట్లు ప్రభుత్వం అందజేసింది.
చెప్పలేనంత సంతోషంగా ఉంది
ఆడబిడ్డ పెండ్లికి అప్పు కోసం వెళ్తే ఎన్నో సార్లు తిప్పుకొని ఇచ్చేవారు కాదు. పెళ్లి పెట్టుకున్నామని దరఖాస్తులు చేసుకున్న వెంటనే రూ.1,00,116 ఇవ్వడం చాలా సంతోషకరం. సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టడం అభినందనీయం. మాటల్లో చెప్పలేని సంతోషం మాకు కలుగుతున్నది. మా బిడ్డ పెండ్లికి ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయం మరువలేనిది. సీఎం కేసీఆర్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. నాకు నలుగురు ఆడపిల్లలు. చివరి పెండ్లి చేయగానే డబ్బులు వచ్చాయి. సీఎం సార్ చేసిన మేలు ఎప్పటికీ మరువలేం.
– బుచ్చయ్య, హన్వాడ మండలం, మహబూబ్నగర్