కల్వకుర్తి, మార్చి 19 : రైతుబంధుపై నీ లినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పథకం పై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండటంతో ఏది నిజమో అర్థం కాని అయోమయంలో రైతులు ఉన్నారు. రైతుబంధు స్థానంలో రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. తీ రా అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుక మడతేసింది. 2023 డిసెంబర్ 12 నుంచి పాత పద్ధతి న.. అంటే రై తుబంధు పథకం ద్వారా యాసంగికి పెట్టుబడి సాయం అం దిస్తామని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి మాట తప్పి రైతుల ఆశలపై నీళ్లు చల్లారు. జనవరి నెలాఖరు వరకు అర్హుల ఖాతా ల్లో డబ్బులు జమ చేస్తామని ప్రకటనలు గుప్పించారు. ఆ త ర్వాత ఫిబ్రవరి ఆఖరు వరకు డబ్బులు ఇస్తామని మరోసారి ప్రకటించినా.. మూడెకరాలకు కూడా ఇవ్వలేదు. మార్చి 15 నాటికి పూర్తి స్థాయిలో డబ్బులు వేస్తామని మరోసారి రాష్ట్ర ప్రభుత్వం తొండి మాటలు చెప్పింది. దీనికితోడు డిప్యూటీ సీఎం మరో కామెంట్ విసిరారు. గత ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఐదారు నెలలు వరకు వేసింది.. ఇందులో ఆందోళన చెందాల్సిందేముందని, తప్పులను మడతపెట్టే ప్రయత్నం చేశారు. రెండ్రోజుల కిందట మళ్లీ మాట్లాడుతూ నా లుగెకరాల వరకు డబ్బులు జ మ చేశామని చెబితే.. సీఎం రేవంత్ మాత్రం మరో అడుగు ముందుకేసి ఐదెకరాల వరకు సాయం అందించామ ని ప్రకటించారు. నాలుగు నిజమా.. ఐదు ఎకరాలకు నిజ మా.. అనే విషయాన్ని పక్కన పెడితే మూడెకరాలకే మోక్షం లేదని రైతులు వాపోతున్నారు. సాయం కోసం ఎదురుచూసి చివరకు ఆశలు వదులుకునే దుస్థితికి వచ్చామంటున్నారు.
నాగర్కర్నూల్ జిల్లాలో 3,22,724 మంది రైతులకు 7,59,793 ఎకరాల పొలం ఉన్నది. వీరికి రైతుబంధు ద్వా రా ఎకరాకు రూ.5 వేల చొప్పున ఇస్తే రూ.379.90 కోట్లు అవసరమవుతాయి. ఎకరాలోపు 1,02,912, రెండెకరాలు ఉన్న రైతులు 81,060, మూడెకరాలు ఉన్న వారు 53,617, నాలుగు ఎకరాలు ఉన్న రైతులు 34,824, ఐదు ఎకరాలు ఉన్న రైతులు 25,600, పదెకరాలు ఉన్న రైతులు 20,594, అంతకుపైగా భూమి ఉన్న రైతులు 4,117 ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని వారం, పది రోజుల్లో జమ చేసేది. ఎకరం నుంచి మొదలై లబ్ధిదారులందరికీ అందేది.
మీట్ది ప్రెస్లో రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఐదెకరాలకు రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పడంతో నాలుగు, ఐదెకరాల పొలం ఉన్న రైతులు సోమవారం బ్యాంకుల వద్దకు చేరుకున్నారు. అక్కడ సిబ్బందిని వాకబు చేస్తే డబ్బులు రాలేదని బాంబ్ పేల్చారు. సీఎం ఐదెకరాల వరకు ఖాతాల్లో డబ్బులు వేశామని చెబుతుంటే మీరు రాలేదని చెబుతున్నారేంటని పలువురు బ్యాంక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. డబ్బులు జమ అయితే మీ ఫోన్కు మెజేస్ వస్తుంది.. కదా అని వారు అడగ్గా.. సీఎం చెప్పాక డబ్బులు రాకుండా ఉంటాయా..? అని బ్యాంక్కు వచ్చామని పలువురు రైతులు వాపోయారు. కొందరు వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్ చేసి డబ్బులు ఎందుకు రాలేదని నిలదీస్తున్నారు. రైతులకు ఏం సమాధానం చెప్పాలో పాలుపోక వ్యవసాయాధికారులు మిన్నకుండిపోతున్నారు.
రైతుబంధు డబ్బులు ఖాతాల్లో నత్తనడకన పడుతున్నాయి. ఇప్పటి వర కు నాగర్కర్నూల్ జిల్లాలో కేవలం మూడున్నర ఎకరాల వరకే మాత్రమే పైసలు పడ్డాయి. మూడు నెలలు గడుస్తున్నా.. మూడెకరాలకు డబ్బులిస్తే.. మొత్తానికి ఇవ్వడానికి ఎన్ని నెలలు పడుతుందని రైతులు నిలదీస్తున్నారు. పెట్టుబడి కోసం మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ‘పాలిచ్చే బర్రెను వదిలేసి దున్నపోతును తెచ్చుకున్న’ చందంగా తమ పరిస్థితి తయారైందంటున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం వానకాలం, యాసంగి సాగుకు పెట్టుబడి సాయం గా ఎకరానికి రూ.10 వేలు అందించింది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా ద్వారా రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చింది. అధికారంలోకి వ చ్చిన తర్వాత ఇవేమీ పట్టనట్లు పాత సా యాన్నే అందించడంపై కర్షకులు పెదవివిరుస్తున్నారు. ఆ డబ్బులను ఇవ్వడంలో కూడా నెలలు.. నెలలు జాప్యం చేయడంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నమ్మితే నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందు పెట్టుబడి సాయం అందిస్తారన్న నమ్మకం లేదని వాపోతున్నారు. ఎకరాకు రూ.5 వేలు ఇవ్వడానికే చేతులెత్తేస్తే ఇక రూ.15 వేలు ఇస్తామన్న ప్రకటన అమలయ్యేది ఎప్పుడో అని రైతులు, సంఘాల నాయకులు నిట్టూరుస్తున్నారు.