పాలమూరు, నవంబర్ 2 : కాంగ్రెస్ పార్టీ 55ఏండ్ల పాలనలో రైతులకు చేసిన మేలు ఏమీలేదని, కరువుకాటకాలతో ఆత్మహత్యలకు నిలయంగా మార్చిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ మండలం ఓబులాయపల్లితండా, ఓబులాయపల్లి, కోటకదిర గ్రామాల్లో మంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో కరువు కాటకాలతో ప్రజలు అల్లాడారని, సీఎం కేసీఆర్ హయాంలో పండుగలా సాగు చేసుకుంటున్నారన్నారు. 60ఏండ్లలో కనీసం తాగేందుకు కూడా నీళ్లు లేవని, నేడు తాగు, సాగునీటితో పల్లెలు, పట్టణాలు పచ్చబడ్డాయన్నారు. రైతుబంధు ద్వారా రైతులు సాయం చేస్తున్న పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ఆపించారని విమర్శించారు. రైతుబంధును కేవలం నెల రోజులు మాత్రమే ఆపగలరని, మా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని, మా రైతన్నకు అందిస్తామన్నారు. ఏడాదికి ఎకరానికి రూ.16వేలు రైతుబంధు సాయం అందించనున్నట్లు వెల్లడించారు. పాలమూరు-రంగారెడ్డి ద్వారా ఉమ్మడి జిల్లాలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించి కరువును శాశ్వతంగా పారదోలుతామన్నారు. మన్యంకొండ వద్ద రోప్వే, టూరిజం హోటల్, ఏసీ కల్యాణ మండపం నిర్మిస్తున్నామని తెలిపారు. శాంతానారాయణగౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదల కుంటుంబాలకు పుస్తె, మెట్టలు అందించి సామూహిక వివాహాలు జరిపిస్తున్నామన్నారు. తన జీవితం ప్రజా సేవకే అంకితమన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ నర్సింహారెడ్డి, ఎంపీపీ సుధాశ్రీ, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, వైస్ ఎంపీపీ అనిత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్యాదవ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు దేవేందర్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ రాజేశ్వర్రెడ్డి, సర్పంచులు రమ్య, చంద్రకళ, అంజమ్మ, శ్రీకాంత్గౌడ్, రాంచంద్రయ్య పాల్గొన్నారు.
మహబూబ్నగర్ అర్బన్, నవంబర్ 2 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ప్రతిపక్షాలు ఖాళీ అవుతున్నాయని, కాంగ్రెస్, బీజేపీ వల్ల దేశానికి నష్టం జరుగుతున్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో విజయ్ప్రసాద్తోపాటు 50మంది, కొత్తగంజ్, మోతినగర్, బీకేరెడ్డి కాలనీ, రాజేంద్రనగర్, వేపూర్గేరికి చెందిన సుమారు 200 మంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 70ఏండ్లుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్, బీజేపీ వల్ల ప్రజలకు కనీస వసతులు లేవన్నారు. రెండు ప్రధాన పార్టీలు కలిసి ప్రాతీయ పార్టీలు ఎదగకుండా చేస్తున్నట్లు విమర్శించారు.
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, నవంబర్ 2 : జిల్లా కేం ద్రంలోని మర్లుకు చెందిన మాజీ కౌన్సిలర్ పిల్లి సురేశ్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో గురువారం హైదరాబాద్లోని కిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. గురువారం సాయంత్రం మంత్రి శ్రీనివాస్గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని పాడే మోశారు.