భూత్పూర్, ఏప్రిల్ 15 : బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే మైనార్టీలు అభివృద్ధి చెందుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని కేఎంఆర్ ఫంక్షన్హాల్లో రంజాన్ ఉపవాసాలను పురస్కరించుకొని 375మందికి శనివారం దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మైనార్టీల అభివృద్ధికి విశేషంగా కృషిచేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని భూత్పూర్, కొ త్తకోట, దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లో ఉర్దూ ఘర్ నిర్మాణానికి రూ.80లక్షలు మంజూరయ్యాయన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో తాగడానికి, సాగునీటికి ఇబ్బందులుండేవని.. ఇప్పుడు ప్రజాసంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అనంతరం 32మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను, నలుగురికి రూ.50వేల చొప్పున రూ.3లక్షల ఎస్సీ కార్పొరేషన్ రుణాలను అందజేశారు.
19వ తేదీన నియోజకవర్గానికి సంబంధించి ఇఫ్తార్ విందును కేఎంఆర్ ఫంక్షన్హాల్లో సాయంత్రం 5:30 గంటలకు నిర్వహిస్తున్నామని.. ముస్లిం లు అధికసంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూ ర్ బస్వరాజ్గౌడ్, ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, తాసీల్దార్ చెన్నకిష్టన్న, ఎంపీడీవో మున్ని, కమిషనర్ నూరుల్నజీబ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహాగౌడ్, మత్స్య సహకారసంఘం జిల్లా ఇన్చార్జి మనెమోని సత్యనారాయణ, సర్పంచులు, వెంకటయ్య, ఆంజనేయులు, ప్రియాంకరెడ్డి, రాములమ్మ, కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, బాలకోటి, రామకృష్ణ, గడ్డం నాగమ్మ, కోఆప్షన్ సభ్యులు ఖాజా, అజీజ్, జాకీర్, నాయకులు అహ్మద్, యాసీన్, మహమూద్, సలీం, బీఆర్ఎస్ నాయకులు నారాయణగౌడ్, సత్యనారాయణ, మురళీధర్గౌడ్, అశోక్గౌడ్, సురేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.