జడ్చర్ల, డిసెంబర్ 20 : బాదేపల్లి వ్యవసాయ మా ర్కెట్లో మళ్లీ ఆర్ఎన్ఆర్ ధాన్యానికి ధరలు పెరిగాయి. మంగళవారం క్వింటా రూ.3,331 పలుకగా బుధవారం క్వింటా రూ.3,539 ధర పలికింది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ రకం ధాన్యానికి అత్యధికంగా క్వింటాకు రూ.3,539 ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. మార్కెట్కు 2,901క్వింటాళ్ల ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.3,539, కనిష్ఠంగా రూ.2,501, మధ్యస్తంగా రూ.3,229 పలికింది.
మార్కెట్కు 444 క్వింటాళ్ల హంసరకం ధాన్యం అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.2,669, చిట్టిముత్యాలు రకానికి క్వింటాకు గరిష్ఠంగా రూ.3,567, 27 క్వింటాళ్ల సోనామసూరి ర కం ధాన్యానికి క్వింటాకు గరిష్ఠంగా రూ.2,569 ధర పలికింది. అలాగే మార్కెట్లో వేరుశనగకు క్విం టాకు గరిష్ఠంగా రూ.7,690, మొక్కజొన్న క్వింటా కు గరిష్ఠంగా రూ.2,273, కనిష్ఠంగా రూ.2,273, మధ్యస్తంగా రూ.2,273 ధర వచ్చింది. అదే విధంగా కందులకు క్వింటాకు గరిష్ఠంగా రూ. 8,464, పత్తి క్వింటాకు గరిష్ఠంగా రూ.6,610 ధర పలికినట్లు మార్కెట్ అధికారులు వెల్లడించారు.