మూసాపేట, మార్చి 30 : తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బుధవారం మండల సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మూసాపేట రైతువేదికలో ఎంపీపీ గూపని కళావతీకొండయ్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి నివేదికలను అధికారులు శాఖల వారీగా తెలియజేశారు. అలాగే గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీడీవో స్వరూప, తాసిల్దార్ మంజుల, రైతుబంధు సమితి అధ్యక్షుడు భాస్కర్గౌడ్, ఎంపీటీసీలు నక్క ఆంజనేయులు, సీజీ గోవర్ధన్, సత్యనారాయణ, సంతోషి, సర్పంచులు సాయిరెడ్డి, స్వరూప, నిర్మలాకాశీనాథ్ తదితరులు ఉన్నారు.
జడ్చర్ల, మార్చి 30 : యాసంగి వడ్లను కేంద్ర ప్ర భుత్వం కొనుగోలు చేయాలని బుధవారం బాదేపల్లి పీఏసీసీఎస్ మహజన సభలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పీఏసీసీఎస్ చైర్మన్ సుదర్శన్గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయకపోతే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. కేం ద్ర ప్రభుత్వమే మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తీర్మానపత్రాన్ని ప్రధాని మోదీకి పంపినట్లు తెలిపారు. సమావేశంలో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, పీఏసీసీఎస్ వైస్చైర్మన్ సుధాకర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ జం గయ్య, టీఆర్ఎస్ మండల అద్యక్షులు రఘుపతిరెడ్డి, శ్రీకాంత్, మురళి, ఇమ్మూ తదితరులు ఉన్నారు.