గట్టు, మార్చి 8 : కాంగ్రెస్ పాలనలో సాగు నీటితోపాటు తాగునీటికి కూడా కష్టాలు ప్రారంభమయ్యాయి. మిషన్ భగీరథ నీళ్లు సరిగ్గా రాకపొవడం తో ప్రజలు అవస్థలు పడుతున్నారు. గట్టు మండలంలోని ఆలూరులో మిషన్భగీరథ తాగునీరు అం దక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గ మనించిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ కుర్వ మల్లమ్మ ఔదార్యాన్ని చాటారు. సొంత ఖర్చులు వెచ్చించి గు రువారం నుంచి ట్యాంకర్ల ద్వారా గ్రామానికి నీటిని సరఫరా చేస్తున్నారు.
ప్రతి రోజూ రూ.వెయ్యి ఖర్చు చేసి గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా మూడు సార్లు నీటిని అందిస్తున్నారు. మిషన్ భగీరథ నీరు సాఫీగా వచ్చే వరకు లేదా వర్షాలు పడేవరకు నీటిని అందజేస్తామని మాజీ సర్పంచ్ పేర్కొన్నారు. కాగా సర్పంచ్ సోదరుడు మేస్త్రీ తిమ్మప్ప ట్యాంకర్ పైప్ద్వారా బిందెలో నింపుతున్న దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.