మూసాపేట (అడ్డాకుల), మార్చి 19 : భక్తుల పాలి ట కల్పతరువుగా విరాజిల్లుతున్న కందూరు రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు 21వ తేదీ నుంచి ప్రా రంభం కానున్నాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయం. అందుకే కాకతీయుల చరిత్రకు నిలయంగా చెప్పుకొంటారు. ఇది అతి పురాతనమైన ఆలయం కూ డా. కాశీలో తప్పా మరెక్కడా లేనివిధంగా కల్పవృక్షా లు కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయం పరిసరాల్లో మానవుల జన్మనక్షత్రాల సంఖ్య 27కు అనుగుణంగా ఉన్నాయి. అందుకే అతి పవిత్రమైన దక్షిణ కాశీ గా పేరుగాంచింది. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని కందూరు గ్రామంలో ఎన్హెచ్-44 నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో రామలింగేశ్వరస్వామి ఆలయం ఉన్నది. ఆలయ ప్రాంగణం లో నిర్మలమైన వాతావరణం, ఆలయాన్ని అనుసరించి ఎత్తైన పెద్దకొండ ఉంటుంది. ఆ ఆలయం పక్కనే స్వా మివారి కోనేరు. ఆ కోనేరు చుట్టూ కల్పవృక్షాలు ఉంటా యి. స్వామివారి కోనేరులో స్నానమాచరించి, స్వామి దర్శనం అనంతరం కల్పవృక్షాల చెట్ల నీడలో కూర్చొని భోజనం చేసి ఇతరులకు పంచిపెట్టినా వారు చేసిన పాపాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. ఆ ఆలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు నిర్మించినట్లు పాలమూరు జిల్లా దేవాలయాలు అనే గ్రంథంలో లిఖించబడింది.
పూర్వం కందూరు గ్రామానికి చెందిన తమ్మలి వం శానికి చెందిన మహిళ కొండపై ఉన్న రామలింగేశ్వరస్వామిని ప్రతిరోజూ దర్శించుకొని పూజించేందుకు వె ళ్లేది. ఆమె గర్భవతి కావడంతో రామలింగేశ్వరస్వామి తో స్వామి నేను ప్రతిదినం ఈ గుట్టెక్కి నిన్ను దర్శించుకోవడానికి చేతకావడం లేదు. మళ్లీ ఎంతకాలానికి నీ దర్శనభాగ్యం కలిగి మిమ్మల్ని సేవించుకోగలనో అని బాధతో స్వామి ముందు రోదించింది. ఆమె భక్తికి స్వామి ప్రత్యక్షమై నీవు రాకుంటే నేనే నీవెంట వస్తాను. నీవు ఎక్కడి వరకు రాగలవో అక్కడి వరకు వెనుదిరిగి చూడకుండా వెళ్లమని చెప్పారు. ఆమె కొంత ముందు కు వెళ్లగానే ఆమెతోపాటు స్వామివారు రథసారథై బ యలుదేరాడు. ఆయన రథం రాళ్లపై వస్తు గుట్టదిగుతుండడంతో అతి భయంకరమైన భీకర శబ్దాలు, గం టల చప్పుడుకు భక్తురాలు భయభ్రాంతురాలై వెనుదిరిగి చూసింది. ఆమె అక్కడే శిలగా మారండంతోపాటు స్వామివారి రథం విరిగి రెండు చక్రాలలో ఒకటి పడి కోనేరుగా ఏర్పడిందని, రెండో చక్రం స్వయంభువుగా లింగాకృతి దాల్చినట్లు చెప్పుకుంటారు. అందుకే స్వా మివారికి నేటికి పానపట్టం లేదు. సాధారణ లింగాకృతి రూపంలోనే దర్శనం ఇస్తారు. కేవలం ఉత్సవ రోజుల్లోనే స్వామి వారి నిజరూప దర్శనం లభిస్తుంది.
కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు పాలనలో కందూరు రామలింగేశ్వరుడు భక్తుల పాలిట కొం గు బంగారమని, ఆయన పిలిస్తే పలికేదైవమని ప్రసిద్ధి చెందడంతో ఆయనే ప్రత్యేకంగా వచ్చి దర్శించుకొని ప్రజల నమ్మకాన్ని పరీక్షించినట్లు పూర్వీకులు చెప్పేవా రు. స్వామివారి మహిమ ప్రతాపరుద్రుడికి తెలియడం తో ఆయన 11వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం పూర్తిచేయడంతో పాలమూరు ఆలయాల్లో ప్రథమదిగా గు ర్తించినట్లు గ్రంథంలో లిఖించినట్లు చెప్పుకొంటారు. ఆలయ పరిసరాల్లో ఉన్న కల్పవృక్షాలు అత్యంత మ హిమ గల చెట్లుగా భావిస్తారు.
కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో కాశీలో తప్ప మరెక్కడా లేనటువంటి కల్ప (కదంభ) వృక్షాలు ఉన్నాయి. అందుకే కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయానికి దక్షిణకాశీ అని పేరు వచ్చింది. ఈ వృక్షాలు మహామహిమ గల వృక్షాలు. వాటి నీడలో వంటచేసి అన్నదానం చేసి, చెట్ల కింద నిద్రపోతే సకల దోషాలు పోయి, చేసిన పాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
రామలింగేశ్వరస్వామి ఉత్సవాలు 21 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు అంకురార్పణం, ధ్వజారోహణం, 22న హోమం, పార్వతీ పరమేశ్వరుల కల్యాణం, 23న రుద్రాభిషేకం, ప్ర భోత్సవం, వృషభవాహన సేవ, 24న ఏకాదశ రు ద్రాభిషేకం, బలిహరణం, రథోత్సవం, 25న వృషభవాహన సేవ, 26న మహాపూర్ణాహుతి, తీర్థావళి కార్యక్రమాలు ఉంటాయి. 26 నుంచి 15 రోజులపాటు జాతర కొనసాగుతుంది. రథోత్సవంతోపాటు జాతర సమయంలో భక్తులకు రామలింగేశ్వరస్వామి నిజరూప దర్శనం ఉంటుంది. అం దుకే జిల్లాతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. ఉత్సవాలు ఏప్రిల్ 17వ తేదీ శ్రీరామనవమి వరకు కొనసాగుతాయని ఆలయ ఈవో రాజేశ్వర్శర్మ తెలిపారు. ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.