నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 11 : నెలరోజుల పాటు పవిత్రంగా ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు నెలవంక కనిపించడంతో గురువారం ప్రత్యేక ప్రార్థనలతో రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో క లిసి ఈద్గాల వద్దకు చేరుకొని ప్రార్థనలు చేశారు. మత పె ద్దలు చెప్పిన బోధనలను విన్నారు. అనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిదులు, అధికారులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహబూబ్నగర్ పట్టణంలోని ఈద్గాల వద్ద ముస్లింలకు ఎంపీ మన్నె, ఎమ్మెల్యే యెన్నం, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ అభ్యర్థులు వంశీచంద్రెడ్డి, డీకే అరుణ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
జడ్చర్ల పాతబజార్లోని ఈద్గా, ఇండస్ట్రీయల్ ఏరియాలోని ఈద్గాల వద్ద ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, సీఐ ఆదిరెడ్డి ముస్లింలకు రం జాన్ శుభాకాంక్షలు తెలిపారు. మక్తల్ పట్టణంలోని ఈద్గా వద్దకు ఎమ్మెల్యే శ్రీహరి చేరుకొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. భూత్పూర్ పట్టణంలో మైనార్టీ నాయకులను మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మైనార్టీ నాయకుడు అహ్మద్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు హాజరయ్యారు. నారాయణపేట పట్టణంలోని ఈద్గా వద్ద బీఆర్ఎ స్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్రెడ్డి, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు నా మాజీ, అదనపు ఎస్పీ నాగేంద్రుడు, డీఎస్పీ లింగయ్య ము స్లింలను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.