రాజాపూర్, అక్టోబర్ 7 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతే గ్రామాలు అన్ని విధాలా అభివృద్థి పథంలో దూసుకుపోతున్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం రాజాపూర్ మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. చెన్నవెల్లిలో సీసీ రోడ్లు, మిషన్ భగీరథ వాటర్ట్యాంక్, పాఠశాల అదనపు గదులు, క్రీడామైదానం ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులకు టీషర్టులు పంపిణీ చేసి వాలీబాల్ క్రీడాపోటీలను ప్రారంభించారు. రాయపల్లిలో సీసీ రోడ్లు, పల్లెప్రకృతివనం ప్రారంభించి, అంగన్వాడీ కేంద్రం, బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్, మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ముదిరెడ్డిపల్లిలో సీసీ రోడ్లు, మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా నిర్మించిన పాఠశాల అదనపు గదులు ప్రారంభించారు. బీసీ కమ్యూనిటీ హాల్, ముదిరెడ్డిపల్లి-నందిగామ బీటీ రోడ్డు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు.
మల్లెపల్లిలో సీసీ రోడ్లు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, స్మశానవాటికను ప్రారంభించారు. లబ్ధిదారులకు గృహలక్ష్మీ ప్రొసీడింగ్లను అందించారు. ఈద్గాన్పల్లిలో రూ.20లక్షలతో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రం, రూ.20లక్షలతో నిర్మించిన రైతువేదికను ప్రారంభించారు. అలాగే దొండ్లపల్లి ఎంపీటీసీ అభిమన్యురెడ్డి సొంత నిధులతో నిర్మించిన పాఠశాల అదనపు గదులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిందన్నారు. అంతేకాకుండా అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. స్వార్థరాజకీయాలకు కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులు కులమతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, డీసీఎంఎస్ చై ర్మన్ ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్నాయక్, వైస్ ఎంపీపీ మహిపాల్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహులు, సర్పంచుల సం ఘం మండలాధ్యక్షుడు బచ్చిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, యూత్వింగ్ మండలాధ్యక్షుడు వెంకటేశ్, ఎంపీటీసీ అభిమాన్యురెడ్డి, సర్పంచులు రాధ వెంకట్రాంరెడ్డి, గంగాధర్గౌడ్, పెంటయ్య, శ్యామ్బాయి, అలివేలు, ఎంపీడీవో లక్ష్మీదేవి, ఎంపీవో వెంకట్రాములు, ఏవో నరేందర్ పాల్గొన్నారు.