ఆలేరు రూరల్, ఆగస్టు 11: యాదాద్రి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు, శారాజీపేట, కొల్లూరు, మదనపల్లి తదితర గ్రామాల్లో నెలకొన్న లోవోల్టేజీ సమస్యను పరిషరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం రైతులు శారాజీపేట సబ్స్టేషన్ను ముట్టడించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం, లోవోల్టేజీ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లోవోల్టేజీ కారణంగా వ్యవసాయ బోరుబావుల స్టార్టర్లు తరచూ కాలిపోతున్నాయని చెప్పారు.
వాటి మరమ్మతులకు రైతులు అదనపు ఖర్చులు భరించాల్సి వస్తున్నదని ఆవేదన చెందారు. విద్యుత్తు సరఫరా సక్రమంగా లేకపోవడంతో బోర్ల నుంచి నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతున్నదని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి లోవోల్టేజీ సమస్యకు శాశ్వత పరిషారం చూపాలని డిమాండ్ చేశారు. ఆలేరు ఏడీఈ వచ్చి లోవోల్టేజీ సమస్యను పరిషరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.