మహబూబ్ నగర్ : పట్టణం నడిబొడ్డున నుంచి వెళ్తున్న రైల్వే డబుల్ లైన్( Railway Double Line ) కోసం అధికారులు తీసుకుంటున్న అనాలోచిత చర్య వల్ల ప్రజలను ఇబ్బందులపాలు చేయవద్దని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) కోరారు. శనివారం పట్టణంలో రైల్వే అధికారులు చేపట్టిన పనులను పరిశీలించారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో డబుల్ లైన్ ప్రతిపాదన తీసుకొచ్చారని గుర్తు చేశారు.
రైల్వే అధికారులు చేపడుతున్న డబుల్ లైన్ పనుల విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని, కాని అధికారులు అనాలోచితంగా ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. రెండు వైపుల తొమ్మిది ఫీట్ల స్థలం తీసుకుంటే సమస్య లేదని, ఒకవైపు ఎక్కువ, మరోవైపు తక్కువ తీసుకుంటుండడం వల్ల వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని అన్నారు.
పేదల ఆస్తులు కొల్లగొట్టినా ఇబ్బందులు పెట్టినా సహించేది లేదని అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.