మహబూబ్నగర్, నవంబర్ 28 : పేదల పెన్నిధి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. అందరూ విద్యావంతులు కావాలన్నదే ఆయన లక్ష్యమని, అందుకే అందరూ చదువుకోవాలని ఆనాడే సూచించారని గుర్తు చేశారు. ఆదివారం ఫూలే వర్ధంతి సందర్భంగా మహబూబ్నగర్లోని పద్మావతి కాలనీలో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు పూర్తిస్థాయిలో సమాంతర న్యాయం జరగాలంటే రిజర్వేషన్ల అమలు తప్పనిసరి అని మొదటి సారిగా చెప్పిన మహోన్నతుడని చెప్పారు. రాష్ట్రంలో గురుకులాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన, వసతులు అందిస్తున్నదని తెలిపారు. విద్యకు పెద్దపీట వేసి పాఠశాలలు, హాస్టళ్లు నిర్మించినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేశామన్నారు. దేశంలో 70కోట్ల బీసీ జనాభా ఉన్నప్పటికీ కేంద్రంలో బీసీ వర్గాలకు ప్రత్యేకించి మంత్రిత్వ శాఖ లేకపోవడం, అఖిల భారత సర్వీసులలో నిబంధనలు పాటించకపోవడం బాధాకరమన్నారు. బీసీ కుల గణనకు అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. రాష్ట్ర రాజధానిలో రూ.3 వేల కోట్లతో అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందన్నారు.అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్, టీఆర్ఎస్ నేత బెక్కెం జనార్దన్ రచించిన జ్యోతిరావు ఫూలే జీవితచరిత్ర పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు.
వైద్య, ఆరోగ్యానికి ప్రాధాన్యం
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చయినా పెడుతుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జెడ్పీ సమావేశ మందిరంలో మహబూబ్నగర్, హన్వాడ మండలాలకు సంబంధించిన 72 మందికి మంజూరైన రూ.43,31,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి పాలనను ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. సరైన వైద్య సేవలు అందక ఎందరో మృతి చెందారన్నారు. తెలంగాణ వచ్చాక మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు దవాఖానల్లో సేవలు పొందినా సీఎం సహాయ నిధి సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆరోగ్యశ్రీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రేషన్ కార్డులు, భగీరథ నీరు, నూతన రోడ్లు, అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇవన్నీ గిట్టని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కౌన్సిలర్లు కిశోర్, రాంలక్ష్మణ్, శ్రీనివాస్రెడ్డి, బెక్కెం జనార్దన్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
గ్యార్వీ వేడుకల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్
జిల్లాకేంద్రంలోని షాసాబ్గుట్ట దర్గాలో ఆదివారం నిర్వహించిన గ్యార్వీ వేడుకల్లో ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొని ప్రార్థనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కులమతాలకతీతంగా హిందూముస్లింలు పండుగలు జరుపుకొంటారన్నారు. మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం ముస్లిం మతపెద్దలు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు వంటలను పరిశీలించారు. కార్యక్రమంలో దర్గా పీఠాధిపతి హజ్రత్ అబ్దుల్జ్రాక్షాఖాద్రీ, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, అబ్దుల్హాదీ, మహ్మద్జకీ, ముస్తాక్శ్రీద్ తదితరులు పాల్గొన్నారు.