కోస్గి, నవంబర్ 18 : ముదిరాజ్ బిడ్డలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, రౌడీ రాజకీయాలకు కేరాఫ్గా మారిన రేవంత్కు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాశ్ అన్నారు. శనివారం కోస్గి మున్సిపాలిటీలోని ఏబీకే ఫంక్షన్ హాల్లో ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనానికి గనులు, భూగర్భవనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండప్రకాశ్ మాట్లాడుతూ అధికంగా జనాభా కలిగిన ముదిరాజ్లను రాజకీయంగా ఎదిగే దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముదిరాజ్ బిడ్డనైన నన్ను పార్లమెంటు నుంచి శాసన మండలి చైర్మన్గా క్యాబినెట్ హోదాను కల్పించినట్లు పేర్కొన్నారు. ముదిరాజ్ల ఆత్మగౌరవాన్ని పెంచేలా సొసైటీలు, మత్స్యశాఖలతో అధికారాన్ని కట్టబెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్లోని కోకాపేటలో ఐదు ఎకరాల్లో ముదిరాజ్ భవన్ నిర్మాణాన్ని చేటప్టడంతోపాటు రూ.3కోట్లతో మహబూబ్గనగర్లో, రూ.2కోట్లతో వనపర్తిలో,
రూ.కోటితో కొడంగల్లో, రూ.30లక్షలతో కోస్గిలో ముదిరాజ్ భవన నిర్మాణాలకు భూమిపూజ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా సిద్దిపేట, మెదక్, జహీరాబాద్లతోపాటు కుమరవెళ్లి, యాదాద్రి, వేములవాడ, భద్రాచలం తదితర పుణ్యక్షేత్రాల్లో ముదిరాజ్ భవన్ నిర్మాణాలు చేస్తున్నట్లు తెలిపారు. ముదిరాజ్ల ముద్దుబిడ్డ పండుగ సాయన్న విశిష్టతను చాటేలా మహబూబ్గనర్లో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆత్మగౌరవాన్ని పెంచినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా షాద్నగర్, పరిగి, చేవెళ్ల ప్రాంతాల్లో కూడా విగ్రాహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో 300 విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్న వెల్లడించారు. తెలంగాణ ముదిరాజ్ బిడ్డ పోలీస్ కిష్టప్ప విగ్రహాన్ని నిజామాబాద్లో ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన బిడ్డను డాక్టర్ చదివించినట్లు పేర్కొన్నారు. కాసాని జ్ఞానేశ్వర్, ఎర్రశేఖర్, నీలం ముదిరాజ్ను రేవంత్రెడ్డి మోసం చేశారని విమర్శించారు. ముదిరాజ్ బిడ్డకు రావాల్సిన ఎమ్మెల్యే టికెట్ను మోసం చేసి మార్కెట్లో అమ్ముకున్నట్లు ఆరోపించారు. ముదిరాజ్ల ఆత్మగౌరవానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపి ఎమ్మెల్యేగా పట్నం నరేందర్రెడ్డిని గెలిపించాలని కోరారు.
అంతరిస్తున్న కులవృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి సీఎం కేసీఆర్ అని మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. మత్స్య సహకార సంఘాల ఏర్పాటుతోపాటు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయడంతోపాటు ప్రత్యేకంగా వాహనాలను అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వాలు ముదిరాజ్ల అభివృద్ధిని పట్టించుకోలేదని, తద్వారా అన్నింటా వెనుబడిపోయి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముదిరాజ్ల ఆత్మగౌరవం పెరిగేలా ఎన్నో అద్భుత సంక్షేమ పథకాలను అందించి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సహకారం అందంచినట్లు పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో కూడా ముదిరాజ్లకు పెద్దపీట వేసే దిశగా సీఎం కృషి చేయనున్నారని, బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
సీఎం కేసీఆర్ హయాంలోనే ముదిరాజ్ల ఆత్మగౌరవం పెంచేలా ఎన్నో కార్యక్రమాలు రూపుదిద్దుకొన్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. అదే తరహాలో రాబోవు రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో ముదిరాజ్ బిడ్డలకు అధిక అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ను నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే అన్నారు. రేవంత్రెడ్డి జిమ్మిక్కుల రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, వారే తగిన బుద్ధి చెబుతారన్నారు. టికెట్లు ఇవ్వకుండా డబ్బు సంచులు అందించిన వారికి అమ్ముకున్నారని విమర్శించారు. గతంలో కూడా ఓటుకు నోటు కేసులో ప్రధానంగా ఉన్నాడని, అటువంటి వ్యక్తి ప్రజా సంక్షేమానికి పాటుపడతాడంటే ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ప్రజల మధ్యకు వెళ్లి ఓట్లు అడిగే దమ్ము రేవంత్కు లేదని, ఓడిపోతాననే భయంతోనే బీఆర్ఎస్ కార్యకర్తలపై, వాహనాలపై దాడులు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అభివృద్ధిని చూసి ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్ద్దీన్, ఎన్నికల పరిశీలకులు కిషన్రావు, మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, దౌల్తాబాద్ జెడ్పీటీసీ మైపాల్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కృష్ణ, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, నియోజకవర్గ అధ్యక్షుడు నర్సింహులు, బాల్సింగ్, సలీం, బీఆర్ఏస్ మున్సిపల్ అధ్యక్షుడు రాజేశ్, కౌన్సిలర్లు శ్రీను, బాలేష్, మద్దూరు సర్పంచ్ వెంకటయ్య, ముదిరాజ్ నాయకులు బాలకిశోర్, శివకుమార్, జగన్, అంతయ్య, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.