నారాయణపేట, నవంబర్ 6 : గత ఎన్నికల సందర్భంగా రాజేందర్రెడ్డిని గెలిపిస్తే జిల్లా చేస్తానని ప్రకటించిన వి ధంగానే ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే జిల్లాగా చేసిన ప్రధాత సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని మినీ స్టేడియం లో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అధ్యక్షతన ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా సీఎం కేసీఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంతు రామ్మోహన్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు తీసుకొస్తే తన జన్మ సార్థకం అవుతుందని చెప్పారు. జిల్లా ఏర్పాటు వల్ల ఈ ప్రాంత ప్రజలు సీఎం కేసీఆర్కు ఎంతో రుణపడి ఉంటారన్నారు. ఎమ్మెల్యేగా మరోసారి ఆశీర్వదించడానికి ప్రజలు ఈ సభకు వచ్చారన్నారు. ఎంత పని ఉన్నా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జనం ఓపికతో ఉన్నారని తెలిపారు. జిల్లా ఇచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి జరిగిందని, ఈ సారి కూడా ప్రజల నుంచి కొన్ని డిమాండ్లు ఉన్నాయన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల మెయిన్ కెనాల్ ద్వారా కాల్వలను తవ్వించి 7,8 నెలల్లో నీరు పారించాలన్నారు. దామరగిద్ద మం డలం కాన్కుర్తి వద్ద రిజర్వాయర్ నిర్మిస్తే కొడంగల్, దామరగిద్ద ప్రాంతానికి సాగునీరు అందుతుందన్నారు. కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాకు రింగురోడ్డు ఏర్పాటు చే యాలన్నారు. తద్వారా హైదరాబాద్ మాదిరిగా అభివృ ద్ధి చెందుతుందన్నారు. రూ.10కోట్లతో నారాయణపేటలో బాలికల పోస్ట్మెట్రిక్ హాస్టల్ను మంజూరు చేయాలని కోరారు. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను ఈ ఏడాది నుంచి ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఎకో పార్క్ వద్ద 50 ఎకరాలు కేటాయించ డం జరిగిందని అందులో అగ్రికల్చర్ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలన్నారు. కేసీఆర్ కళాభవన్ను మంజూరు చేయాలని కోరారు. మరికల్లో కైటెక్స్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని, జిల్లా ఏర్పడినందున హజ్హౌస్ను ఏర్పాటు చేయాలన్నారు. ముదిరాజ్ ముద్దుబిడ్డల కోసం రూ.2కోట్లతో రెండు ఎకరాల్లో ముదిరాజ్ భవనం నిర్మించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఎర్రశేఖర్, ఇందిర, ఎన్నికల ఇన్చార్జి దేవరి మల్లప్ప, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు విఠల్రావు ఆర్య, జెడ్పీ వైస్చైర్మన్ సురేఖారెడ్డి, ఎమ్మె ల్యే సతీమణి స్వాతిరెడి పాల్గొన్నారు.
నారాయణపేటరూరల్, నవంబర్ 6 : జిల్లా కేంద్రంలోని జరిగిన ప్రజా ఆశీర్వాదసభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హెల్ప్యా డ్లో మక్తల్ నుంచి నారాయణపేటకు వచ్చిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, మంత్రి శ్రీనివాస్గౌడ్కు స్థానిక ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.