మహబూబ్నగర్టౌన్, జనవరి 29: ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీ ఫతే మసీద్ సమీపంలో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో మహబూబ్నగర్లో తాగునీటి కోసం, విద్యుద్దీపాల కోసం జనం ఇబ్బందులు పడే వారని గుర్తు చేశారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు అధ్వానంగా ఉండేవని, కానీ నేడు ఆ పరిస్థితులు లేవన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక మహబూబ్నగర్ పట్టణం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నదన్నారు. జంక్షన్లు, రోడ్ల విస్తరణ, పెద్ద చెరువును ట్యాంక్బండ్గా అభివృద్ధి చేశామని తెలిపారు. త్వరలో మిగితా పనులు పూర్తి చేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. అనంతరం హైమాస్ట్ లైట్లను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజివెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేశ్, కౌన్సిలర్లు నీరజా విఠల్రెడ్డి, షబ్బీర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు అర్షద్అలీ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నాగరికత నేర్పింది కుమ్మరులే..
మహబూబ్నగర్ అర్బన్, జనవరి 29: మట్టితో వివిధ రకాల పాత్రలను తయారుచేసి నేటి సమాజానికి నాగరికత నేర్పింది కుమ్మర కులస్తులని ఎక్సైజ్శాఖ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని విజన్ గార్డెన్ ఫంక్షన్హాల్లో కుమ్మరుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు సానె తిప్పి కుండ తయారు చేశారు. మట్టిపాత్రలను పరిశీలించి కుమ్మరుల సంక్షేమ సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించారు. నేటి సమాజం మట్టి వాడకాన్ని తగ్గించి పాస్టిక్, అల్యూమినియంతో తయారు చేసిన వస్తువులను వాడుతున్నారని, వాటి వల్ల అనేక రకాల రోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
కొత్తగా ఏర్పాటు చేసిన శిల్పారామంలో మట్టి పాత్రల స్టాల్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో మూడెకరాల స్థలంలో ఆత్మగౌరవ భవనాన్ని నిర్మిస్తున్నామని గుర్తుచేశారు. జిల్లాకేంద్రంలో కుమ్మర భవన నిర్మాణానికి 2వేల గజాల స్థలం కేటాయించామని, త్వరలో రూ.10లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమం లో ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ వైస్చైర్మన్ గణేశ్, గంగిరెడ్డి, కృష్ణమోహన్, కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంత్రావు, దయానంద్, జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న, ఎల్లప్ప, రాచయ్య, రాజశేఖర్, రాజలింగం, శ్యాంసుందర్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.