గద్వాల, ఆగస్టు 18 : సీఎం రేవంత్రెడ్డి తీసుకొచ్చిన శక్తి స్కీమ్ వల్ల డిప్లొమా విద్యార్థులకు తీవ్ర అ న్యా యం జరుగుతుందని శక్తి స్కీం కోసం తీసుకొచ్చిన జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీ పీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు జిల్లా కేం ద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ పా త బస్స్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించి ప్రభుత్వానికి,విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా వి ద్యార్థులు నినాదాలు చేశారు.
వర్షం సైతం లెక్క చే యకుండా విద్యార్థులు కలెక్టరేట్ ప్రధాన గేటు ఎదు ట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భం గా పాలిటెక్నిక్ విద్యార్థులు మాట్లాడా రు. పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెస్తే తమకు తీవ్ర అ న్యాయం జరుగుతుందని వారు మండిపడ్డారు. అసలు ఎవరిని అడిగి ఈ స్కీం తీసుకొచ్చారని విద్యార్థులు ప్ర శ్నించారు. ప్రభుత్వం తెచ్చిన ఈ స్కీం వల్ల సాంకేతిక విద్యామండలి స్వతంత్రత దె బ్బ తింటుందని, డిప్లొమాను సాధారణ శ్రామిక శిక్షణగా మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభు త్వం విడుదల చేసిన జీవో 97ను వెంటనే రుద్ద చే యాలని డిమాండ్ చేశారు. లేకపోతే విద్యార్థుల ఆగ్రహానికి ప్రభుత్వం గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎం తెచ్చిన శక్తి స్కీం వల్ల మా మూడేళ్ల చదువు వృథాఅవుతుందని ఆందోళన వ్యక్తం చే శా రు. ఇప్పుడు తాము ఇంజినీరింగ్ చేయాలంటే మళ్లీ ఇంటర్ చేసి రావాలా అని సర్కారును ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి డౌన్డౌన్ అంటూ రాజీనామా చేయాలని ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.