వనపర్తి టౌన్, జూన్ 4 : మేథాసంపత్తికి సాంకేతికతను జోడించి పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సురక్ష వేడుకల్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్పవార్, ఎస్పీ రక్షితామూర్తితో కలిసి మంత్రి నిరంజన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్య, సంక్షేమం వంటి రంగాల్లో జిల్లా నెంబర్వన్గా నిలిచిందన్నారు.
ప్రతి పోలీస్ స్టేషన్కు నెలవారీ ఖర్చులు, వ్యక్తిగత జీతభత్యాలు అందిస్తున్నామన్నారు. ప్రెంఢ్లీ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశామని, సాంకేతికతతో పోలీసులు పనిచేస్తున్నారన్నారు. దేశంలోనే పాస్పోర్ట్ వెరిఫికేషన్లో రాష్ట్రం ఎన్నో అవార్డులను సాధించిందని గుర్తుచేశారు. పోలీస్ వెల్ఫేర్లో కూడా తెలంగాణనే ముందుందని, ఉద్యమంలో కూడా పోలీసుల పాత్ర ఎంతో ఉందన్నారు. షీటీమ్స్తో మహిళలకు భద్రత కల్పించామన్నారు. ఉద్యోగులు, అధికారులు కుటుంబసభ్యులతో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ వామన్గౌడ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఏఎస్పీ షాకీర్హుస్సేన్, డీఎస్పీ ఆనంద్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.