మహబూబ్నగర్ మెట్టుగడ్డ, డిసెంబర్ 30 : జిల్లా కేంద్రంలోని స్టేడియంలో పోలీస్ ఈవెంట్స్ సాఫీగా సాగుతున్నాయి. పోలీసు ఎస్సై, కానిస్టేబుల్ పురుష అభ్యర్థులకు శుక్రవారం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలకు 1324మంది హాజరు కావాల్సి ఉండగా, 1201మంది హాజరయ్యారు.
అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం 1125మందికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. తుది పరీక్షకు 844మంది అర్హత సాధించారు. దేహదారుఢ్య పరీక్షలను చీఫ్ సూపరింటెండెంట్లు ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, ఐపీఎస్ చేతన పర్యవేక్షించారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ ఏఎస్పీ రాములు, డీపీవో సిబ్బంది పాల్గొన్నారు.