రాజాపూర్, మార్చి 31 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వాహనంలో ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న రూ. 2.39 లక్షల నగదును స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్సై రవి తెలిపారు. ప్రజలు రూ.50వేలకు మించి నగదును తరలిస్తే వాటికి సంబంధించిన ఆధారాలు ఉంచుకోవాలని ఆయన సూచించారు.
గోపాల్పేట, మార్చి 31 : మండలంలోని బుద్దా రం గండి చెక్పోస్టు వద్ద పోలీసులు ఆదివారం వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని అమడాలకుంట తండాకు చెందిన వత్యావత్ బాషానాయక్ బైక్పై వెళ్తుండగా అతడి వద్ద రూ. 1.35లక్షలు గుర్తించారు. అందకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసినట్లు ఎస్సై హరిప్రసాద్ తెలిపారు.