పాలమూరు, ఫిబ్రవరి 20 : పీఎం ఉషా (ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్) పథకం విద్యార్థులకు వరమని, వచ్చిన అవకాశాలను సద్వినియో గం చేసుకోవాలని పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ లక్ష్మీకాంత్ రాథోడ్ అన్నారు. మహబూబ్నగర్ సమీపంలోని పీయూలో (పీఎం ఉషా) ప థకాన్ని ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. కార్యక్రమానికి ఎం పీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్ రవినాయక్ హాజరయ్యారు. ఈ సం దర్భంగా వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ పీఎం ఉషా ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థలకు నిధులను సమకూర్చి ఉన్నత విద్య, అభ్యాస విధానాన్ని మెరుగుపర్చడం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మల్టీడిసిప్లీనరీ ద్వారా ఉపాధి పెంచేందుకు ప్రాధాన్యత ఇస్తారన్నారు.
ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన జిల్లాలో ఇలాంటి పథకాలతో విద్యార్థులకు ఉన్నత విద్య అందుతుందన్నారు. దేశవ్యాప్తంగా 1,114 విశ్వవిద్యాలయాలు పథకానికి దరఖాస్తు చేసుకోగా, 25 విశ్వవిద్యాలయాలకు రూ.100కోట్ల నిధులకు ఎంపికయ్యాయన్నారు. ఇందులో పాలమూరు యూనివర్సిటీ ఉం డడం అభినందనీయమన్నారు. స్కిల్ డెవలప్మెం ట్ సెంటర్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10కోట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంజూరు చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో పీ యూ రిజిస్ట్రార్ మధుసూదన్రెడ్డి, మున్సిపల్ చైర్మ న్ ఆనంద్కుమార్గౌడ్, వివిధ విభాగాల ప్రిన్సిపా ళ్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.