ఊట్కూర్, జూన్ 30 : హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలో నాటేందుకు మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిం చేం దుకు అధికారులు గ్రామాల్లో ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఎనిమిది విడతల్లో కొనసాగిన కార్యక్రమం ద్వారా నాటిన మొక్కలు పచ్చదనం పంచుతున్నాయి. అయితే పూర్తి స్థాయి లక్ష్యాన్ని చేరేందుకు ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ నుంచి తొమ్మిదో విడుత హరితహారం కార్య క్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే గ్రామా ల్లో మొక్కలు నాటేందుకు అధికారులుప్రణాళికలు సిద్దం చేశారు. మండలంలో 23 నర్సరీల్లో మొక్కలను పెంచి సిద్ధ్దం చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా పంచా యతీల్లో, అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నర్సరీల ద్వా రా మొక్కలను పెంచారు. మరో వారం రోజుల్లో వర్షం కురయడమే ఆలస్యం మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
గ్రామాల్లో నర్సరీల ఏర్పాట్లు
మండలంలోని 23 పంచాయతీలకు గాను 1.35 లక్షల మొక్కలను పెంచుతున్నారు. ఊట్కూర్, ఎర్గట్పల్లి, పాత పల్లి, కొత్తపల్లి, అవుసలోనిపల్లి, పెద్దజట్రం, తిమ్మారెడ్డిపల్లి తండా, లక్ష్మీపల్లి, తిప్రాస్పల్లి, అమీన్పూర్, వల్లంపల్లి, ఓబ్లాపూర్, కొల్లూరు, సంస్థాపూర్, నాగిరెడ్డిపల్లి, మల్లేపల్లి, చిన్నపొర్ల, ఎడవెల్లి, పులిమామిడి, బిజ్వారం, మొగ్దుంపూర్ తదితర గ్రామాల్లో పంచాయతీ, అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కల పెంపకం చేపట్టారు. నర్సరీల బాధ్యత గ్రామ పంచాయతీలకు అప్పగించారు. నర్సరీలను ఎప్పటి కప్పుడు కార్యదర్శులు పర్యవేక్షిస్త్తూ మొక్కలను సంరక్షి స్తున్నారు. నర్సరీల్లో కానుగ, జామ, నిమ్మ, దానిమ్మ, సీతాఫలం, బొప్పాయి, పూలు, నీడనిచ్చే మొక్కలను పెంచుతున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లకు ఇరు వైపులా, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటించేందుకు ఉపాధి కూలీల చేత గుంతలు తీయించి సిద్ధ్దం చేస్తున్నారు. ఈసారి నాటే ప్రతి మొక్క పెరిగేలా ఇటు అధికార యంత్రాంగం, అటు ప్రజా ప్రతినిధులు చొరవ తీసు కుంటున్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష సైతం అధికా రులు, సిబ్బంది అలసత్వం వహించకుండా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
వర్షాలు కురిసిన వెంటనే..
హరితహారం కార్యక్రమానికి మొక్కలను సిద్ధ్దం చేసిన ట్లు ఉపాధిహామీ ఈసీ శ్రీనివాసులు తెలిపారు. వర్షాలు అనుకూలంగా కురిసిన వెంటనే నర్సరీల నుంచి మొక్క లను తీసుకొని అన్ని గ్రామాల్లో నాటేందుకు ఏర్పాట్లు పూర్తి చేసి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు.
అందరూ భాగస్వాములు కావాలి
తొమ్మిదో విడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వ హించేందుకు ప్రణాళికలను రూపొందించాం. అన్ని శాఖల పరిధిలో మొక్కలు నాటేందుకు సిద్దం చేశాం. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ ఏడాది జూన్ 19 నుంచే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలందరూ భాగస్వాములు కావాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరగలం.
– కాళప్ప, ఎంపీడీవో