మరికల్, డిసెంబర్ 16 : అంత్రాష్ట్ర ప్రధాన రహదారిపై గల పెట్రోల్ బంకు ల్లో పెట్రోల్, డీజిల్లు 24 గంటలపాటు అందుబాటులో ఉంచాలని, నో స్టాక్ బోర్డులు పెడితే ఎలా అని అదనపు కలెక్టర్ పద్మజారాణి ప్రశ్నించారు. మండలంలోని పెట్రోల్ బంకులను శుక్రవా రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ మండలంలో మూడు పెట్రోల్ బంకులు ఉన్నా వాహనదారులకు ఎందుకు అం దుబాటులో పెట్రోల్, డీజిల్ ఉంచడం లేదని ప్ర శ్నించారు.
బ్లాక్లో విక్రయాలకు సహకారం అం దజేస్త్తున్నట్లు సమాచాం ఉందని, మరోసారి బ్లాక్ లో ఎవరైనా పెట్రోల్, డీజిల్ విక్రయిస్తే వారిపై చ ర్యలు తీసుకుంటామన్నారు. నిత్యం వాహనదారులకు 24 గంటలపాటు పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉండేలా డీలర్లు చర్యలు తీసుకోవాలని, అలా చేయకుంటే డీలర్ షిప్లను రద్దు చేస్తానని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. ఎందుకు నో స్టా క్ బోర్డులు పెడుతున్నారని, ప్రతి బంకులో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా పెట్రోల్, డీజి ల్ పోయాలన్నారు. మరోసారి వాహనదారుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవన్నారు. ఈ నెల 14న యువకులు పెట్రోల్ బంకుల నిర్వహ ణ, బ్లాక్లో విక్రయాలపై తాసిల్దార్కు వినతిపత్రం ఇవ్వడంతో అధికారులు స్పందించి పెట్రోల్ బం కులను తనిఖీ చేశామన్నారు. డీలర్లు సక్రమంగా డీడీలు చెల్లిస్తే పెట్రోల్, డీజిల్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డీటీ కళప్ప, యువకులు పాల్గొన్నారు.