ఇటిక్యాల: పెత్రమాస పర్వదినాన్నిపురస్కరించుకొని బుధవారం బీచుపల్లి క్షేత్రములో భక్తులు పొటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు కృష్ణానదిలో స్నానం ఆచరించారు. అనంతరం ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకొన్నారు. ఈ సందర్భంగా పుష్కరఘాట్ వద్ద పిండప్రదానాలు చేశారు. గతంలో ఎన్నడు లేనంతగా భక్తులు రావడం విశేషం. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ భక్తులకు అన్నదాన కార్యక్రమంతోపాటు అన్ని ఏర్పాట్లు చేసింది.