గద్వాల, ఫిబ్రవరి 5 : గద్వాల నియోజకవర్గంలో కేంద్రీయ, జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం ఎంపీ రాములుతో కలిసి ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ఢిల్లీలో సెంట్రల్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సంజయ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యదర్శికి పలు విషయాల ను వివరించారు.
గద్వాల నియోజకవర్గం విద్యాభివృద్ధిలో వెనుకబడి ఉందని, మల్దకల్ మండలంలో కేంద్రీయ విద్యాలయం, కేటీదొడ్డి మండలంలో జ వహర్ నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని ఎంపీతో కలిసి కోరారు. అందుకు సెక్రటరీ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.