మరికల్, అక్టోబర్ 30 : బీఆర్ఎస్తోనే ప్రజా సంక్షేమం సాధ్యమని, కాంగ్రెస్ను నమ్ముకుంటే నట్టేట ముంచడం ఖాయమని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మండలంలోని మాధ్వార్, ఇబ్రాహీంపట్నం, ఎల్లిగండ్ల, పస్పుల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్నాటకలో కరెంట్ కష్టాలతో రైతులు అవస్థలు పడుతున్నారు. కారు పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో కర్షకుడు ఆనందంగా ఉన్నాడన్నారు. కాంగ్రెస్తో వచ్చే కరెంట్ కష్టాలు కావాలో, కారు పార్టీతో వచ్చే కర్షకుడి ఆనందం కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో నారాయణపేట నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి దేవరి మల్లప్ప, సీనియర్ నాయకుడు విఠాల్రావు ఆర్యా, జెడ్పీ వైస్ చైర్పర్సస్ గౌని సురేఖారెడ్డి, వైస్ ఎంపీపీ రవికుమార్ పాల్గొన్నారు.
ధన్వాడ, అక్టోబర్ 30 : అభివృద్ధి పనులతోపాటు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి నాయకులు, కార్యకర్తలకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలో మరికల్, ధన్వాడ మండలాల బూత్ స్థాయి కార్యాకర్తల సమావేశం నిర్వహించారు.
కోయిలకొండ, అక్టోబర్ 30 : మండలంలోని శేరివెంకటాపూర్లో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సమక్షంలో గార్లపహడ్, అభంగపట్నం, శేర్పల్లి, ఇబ్రహీంనగర్ గ్రామాల నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి 400 మంది నాయకులు బీఆర్ఎస్లో చేరారు.