మద్దూర్(కొత్తపల్లి), ఏప్రిల్ 2 : వేసవి ప్రారంభంలోనే కొడంగల్ నియోజకవర్గ ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. మొన్న మద్దూర్ మండలంలోని దోరెపల్లి ప్రజలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన ఘటన మరువకముందే మంగళవారం కొత్తపల్లి మండలం వాల్యానాయక్ తండాలో చోటు చేసుకున్నది. పట్టణాలు, గ్రామాల్లో సైతం బోర్లు ఎండిపోవడం, చాలీచాలని మిషన్ భగీరథ నీటితో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం వాల్యానాయక్ తండాలో సుమారు 200మంది నివసిస్తున్నారు. ఈ గ్రామంలో భగీరథ నీరు రాక నాలుగు రోజులవుతున్నది. తండాలోని బోరు నుంచైనా నీటిని తెచ్చుకుందామంటే స్టార్టర్ లేక పొలాల్లోని బోర్లను ఆశ్రయిస్తున్నారు. కాగా ఎండాకాలంలో తమను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పొలాల్లోంచి నీళ్లు తెచ్చే క్రమంలో చిన్నారులు, వృద్ధులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన చెందుతున్నారు. దీంతో మంగళవారం పొలం నుంచి స్టార్టర్ను తీసుకొచ్చి గ్రామంలో ఉన్న సింగిల్ ఫేజ్ మోటర్ను స్టార్ట్ చేసుకొని నీళ్లు పట్టుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామంలో నీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తూ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలోనే రోజుకో గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు నిరసన తెలుపుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే కొడంగల్ను అభివృద్ధి చేస్తారని భావిస్తే కనీసం తాగునీటిని అందించే పరిస్థితి కూడా లేదని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఇంట్లోని సోరోళ్లంతా బతుకుదెరువు కోసం పట్నానికి పోయిం డ్రు. నాకేమో చేతకాదు. మా తం డాలో నీళ్లు రాక నాలుగు రోజులైతుంది. గుక్కెడు నీటికోసం పొ లాల కాడికి పోతున్నం. అధికారులకు చెప్పి బోరు మోటరు, మిషన్ భగీరథ నీరు మా ఊరికి వచ్చేటట్లు చెయ్యండి సారూ..