సమస్యలు ఉంటే ప్రజలు ఎమ్మెల్యే వద్దకు వెళ్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. ఎమ్మెల్యేనే సమస్యలు తెలుసుకునేందుకు జనం వద్దకు వెళ్తున్నారు. కేవలం అధికారులు, ప్రజాప్రతినిధుల వెంట మాత్రమే వస్తారు.. ప్రతి వారం మూడ్రోజులు ‘గుడ్మార్నింగ్ నాగర్కర్నూల్’ పేరుతో గ్రామాల్లోనే పర్యటిస్తుంటారు. ఉదయాన్నే గడప గడపకూ వెళ్లి ప్రజల సమస్యలు ఆలకిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలను అక్కడే పరిష్కరించి.. మిగతావి అధికారులతో సమీక్ష నిర్వహించి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇంతకీ ఎవరా నేత అనుకుంటున్నారా.. ఇప్పటికే పేరు మీకు గుర్తు రావాలే.. ఆయనే నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి. గతేడాది నవంబర్ 14వ తేదీ నుంచి పబ్లిసిటీ లేకుండా.. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా ఇండ్ల ఎదుట ప్రత్యక్షవుతుండడంతో ప్రజల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. నిత్యం ప్రజలతో మమేకమవుతూ.. వారి కష్టాలను తెలుసుకొని పరిష్కరిస్తూ జన నేతగా గుర్తింపు పొందారు. కార్యక్రమం ప్రారంభించిన 82 రెండ్రోజుల్లో 19 గ్రామాలు, జిల్లా కేంద్రంలోని రెండు వార్డుల్లో పర్యటన విజయవంతంగా పూర్తి చేశారు. తన రూటే సెపరేట్ అంటూ ప్రత్యేక మార్క్తో యాత్ర చేస్తూ విపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
మహబూబ్నగర్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘అవ్వా..! ఎలా ఉన్నావ్..? ఆసరా ఫించన్ వస్తుందా..? పొ లం పనులకు పోతున్నవా..?’ ‘తమ్మీ మంచి గా సదువుకుంటున్నావా?’ ‘రోజూ తాగునీళ్లు వస్తున్నాయా..?’ అంటూ ఓ ప్రజాప్రతినిధి ఆ త్మీయంగా పలకరిస్తూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను స్ఫూర్తిగా తీసుకొని వారంలో మూడు రోజులు పల్లె బాట పట్టారు. ‘గుడ్మార్నింగ్ నాగర్కర్నూల్’ పేరి ట చేస్తున్న యాత్ర.. విపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నది. గతంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై.. ప్ర జల మొహాలు కూడా చూడని నేతలు హడలెత్తిపోతున్నారు. ఉదయం ఏడు గంటలకు గ్రామానికి చేరుకొని కాలినడకన గడపగడపకూ వెళ్లి పలకరించి.. సమస్యలు తెలుసుకుంటున్నారు. గంటల తరబడి గ్రామంలోనే తిరిగి.. రచ్చకట్ట వద్ద సమావేశమవుతున్నారు. గ్రామంలో చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. మిగతా వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సం బంధిత అధికారులతో సమీక్షించి పరిష్కార మార్గం చూపుతున్నారు. మం డలం, గ్రామానికి చెందిన అధికారులను వెంటేసుకుని పాదయాత్ర చే స్తున్నారు. ఒక్కోసారి రాత్రి వరకు గ్రామంలోనే ఉంటున్నారు. స్థానికులతో అల్పాహారం, మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ నిధులతోపా టు తన చారిటబుల్ ట్రస్ట్ డబ్బులు కూడా కే టాయిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
క్యాంప్ కార్యాలయానికి వచ్చి ప్రజలు తమ బాధలు విన్నవించే బదులు.. తనే వారి వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలనే ఆలోచన నుంచే ‘గుడ్మార్నింగ్ నాగర్కర్నూల్’ పుట్టింది. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. గతేడాది నవంబర్ 14న నాగర్కర్నూల్ మండలం పుల్జాల గ్రామం నుంచి సాదాసీదాగా ప్రారంభమైంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఎమ్మెల్యే, అధికారులు తమ ఇండ్ల ముందు ప్రత్యక్షం కావడంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. పబ్లిసిటీ కోసమే యాత్ర చేస్తున్న ఈ రోజుల్లో.. ఎమ్మెల్యే మార్నింగ్ వాక్కు వచ్చినట్లు రావడంతో అవాక్కయ్యారు. ఎమ్మెల్యే వస్తున్నాడని బాజాభజంత్రీలు లేవు.. మైకుల సప్పుడు లేదు.. పూలదండలు లేవు.. సన్మానాలు అసలేలేవు. ముఖ్యమైన అధికారులు, పంచాయతీ కార్యదర్శితో కలిసి గడపగడపకూ తిరుగుతున్నారు. ప్రజల నుంచి ఊహించని విధంగా స్పందన వచ్చింది. ఇప్పటివరకు 82 రోజులపాటు 19 గ్రామాల్లో, నాగర్కర్నూల్ మున్సిపాలిటీలోని రెండు వార్డుల్లో సమస్యలు తెలుసుకున్నారు.
ప్రతివారం మూడు రోజులపాటు వరుసగా ఎమ్మెల్యే మర్రి ‘గుడ్మార్నింగ్ నాగర్కర్నూల్’ చేపడుతున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే క్రమంలో భాగంగా కార్యక్రమం అయిపోయి వెంటనే కలెక్టర్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. భూ సంబంధిత సమస్యలుంటే వాటిని ఆర్డీవో, తాసిల్దార్తో కలిసి పరిష్కరిస్తున్నారు. వ్యక్తిగత సమస్యలు ఉంటే తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నారు. గ్రామాల్లో ఇండ్లు లేని నిరుపేదలే ఎక్కువగా ఉండడంతో వారి పేర్లను ప్రత్యకంగా రాసుకొని డబుల్ బెడ్రూం పంపిణీ సమయంలో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ఎమ్మెల్యే మర్రి చేపట్టిన ‘గుడ్మార్నింగ్ నాగర్కర్నూల్’తో నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నది. కాంగ్రెస్, బీజేపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. కాంగ్రెస్లో వర్గ విభేదాలు, నాగం జనార్దన్రెడ్డిని తప్పించాలనే డిమాండ్లు, కొత్త నాయకత్వం వస్తేనే మర్రి జనార్దన్రెడ్డిని ఢీ కొంటాం.. లేకపోతే కష్టం’ అని ఆ పార్టీ నేతలు భావిస్తున్న తరుణంలో చేపట్టిన యాత్రతో హడలెత్తిపోతున్నారు. సమస్యల్లేని నాగర్కర్నూల్గా మారితే మమల్ని పట్టించుకునేదెవరు అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు మదనపడుతున్నారు.
ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. గెలుపోటములు స హజం.. ప్రజలకు ఏం చేశామన్నదే ముఖ్యం. నన్ను కలవాలని ఎంతోమంది ప్రజలు నాయకులను వెంట వస్తుంటారు. సమయాభావం వల్ల వారిని కలువలేకపోతున్నా. నాయకులు కూడా చిన్న చిన్న సమస్యలను విన్నవిస్తున్నారు. జనం ఎక్కువగా ఉండడంతో చెప్పలేకపోతున్నారని గమనించి ‘గుడ్మార్నింగ్ నాగర్కర్నూల్’కు శ్రీకారం చుట్టాను. మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఉన్న తృప్తి మాటల్లో చెప్పలేనిది. గ్రామాల్లో ఉన్న సమస్యలు కూడా ప్రత్యక్షంగా తెలుసుకునే వీలు కలుగుతున్నది. ప్రభుత్వ పథకాలు కూడా అందుతున్నాయా..? లేదా..? అనేది తెలుసుకోవచ్చు. నా దృష్టికి వచ్చిన సమస్యలను వంద శాతం పరిష్కరిస్తా.
– మర్రి జనార్దన్రెడ్డి, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే