కూ.. చుక్ చుక్.. అన్న రైలు కూత నాగర్కర్నూల్ ప్రజలకు కలగానే మిగిలిపోతున్నది. దశాబ్దాల తరబడిగా ఈ జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న గద్వాల-మాచర్ల రైల్వేలైన్ పనులు కాగితాలకే పరిమితమవుతున్నాయి. మూడు సార్లు సర్వే పనులు చేపట్టి మమ అనిపించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలను కలుపుతూ వెళ్లే ఈ రైలుతో మూడు జిల్లాల ప్రజలకు మేలు చేకూరనున్నది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న నాటి కాంగ్రెస్, నేటి బీజేపీ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుపై శీతకన్ను వేస్తున్నాయి. తరాలు మారుతున్నా కేంద్రంలోని సర్కార్ తీరు మాత్రం మారడం లేదు. దీంతో ప్రజల్లో నిరాశ వ్యక్తమవుతుండగా.. కొత్తగా ఆవిర్భవించిన
బీఆర్ఎస్ పార్టీపై ప్రజలు ఆశలు పెట్టుకొన్నారు.
నాగర్కర్నూల్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : రైలు కూత వినే భాగ్యానికి కం దనూలు ప్రజలు నోచుకోవడంలేదు. జిల్లా ప్రజలు దశాబ్దాలుగా రైలు రాక కోసం నిరీక్షిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం లో ఎక్కడైనా తమ జిల్లా గురించి ప్రస్తావన వస్తుందా అని ప్రతిసారీ ఎదురుచూస్తున్నారు. జిల్లా కేంద్రంగా ఉన్న నాగర్కర్నూల్ను రైలు సౌకర్యం లేని కారణంగా మహబూబ్నగర్కు మార్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నాటి కాంగ్రెస్, నేటి బీజేపీ ప్రభుత్వాలు రైల్వేలైన్పై శీతకన్ను ప్రదర్శించారు. గతంలో మాచర్ల-గద్వాల లై న్ కోసం మూడు సార్లు సర్వే చేశారు.
1980లో రై ల్వేలైన్ ప్రతిపాదనలకు అంకురార్పణ జరిగింది. దీం తో రైలు వస్తుంది అని ప్రజల్లో ఆశలు చిగురించినా.. అంతలోనే ఉస్సూరుమనిపించాయి. ఈ లైన్ పూర్తయి తే మాచర్ల నుంచి నాగార్జునసాగర్, దేవరకొండ, కల్వకుర్తి, నాగర్కర్నూల్, అచ్చంపేట, వనపర్తి, గద్వాల వర కు రైల్వే సేవలు అందుబాటులోకి వస్తాయి. తెలంగాణ ఏర్పడ్డాక నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలుగా ఆవిర్భవించాయి. ఈ క్రమంలో అభివృద్ధిలో ఈ ప్రాంతాలు వివిధ రంగాల్లో ప్రత్యేక స్థానంలో నిలుస్తున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలో ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులతో, నల్లమల అడవిలో విరివిగా లభించే కలపతో కాగితపు పరిశ్రమ కు, అటవీ ఉత్పత్తులకు అనువైన ప్రాంతంగా ఉన్నది.
ఇక వే రుశనగ, పత్తి, వరి వంటి పంటల దిగుబడి గణనీయంగా వ స్తున్నది. తాజాగా సోమశిల-సిద్ధేశ్వరం జాతీయ రహదారి, కృష్ణా నదిపై తీగల వంతెన ప్రతిష్టాత్మకంగా తెరమీదకు వచ్చా యి. ఈ క్రమంలో ప్రజల చూపంతా రైలుపైనే నిలిచింది. ఈ కలను గతంలో ఏ పాలకులూ పట్టించుకోలేదు. ఎంపీలుగా పనిచేసిన పలువురు నేతలు వినతులు ఇస్తున్నా.. ఉత్తరాదిలోని పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. వారి అర్జీల న్నీ బుట్టదాఖలయ్యాయి. 2002లో కేంద్ర రైల్వే శాఖ స హాయ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ మొదటి దశ ప నులకు శంకుస్థాపన చేశారు. దశల వారీగా మాచర్ల వరకు రై ల్వేలైన్ను పీపీసీ పద్ధతిలో పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే అది కార్యరూపం దాల్చడం లేదు.
దాదాపుగా 154 కిలోమీటర్ల మేర ఉన్న రైల్వేలైన్ అందుబాటులోకి వస్తే కర్ణాటకలోని రాయిచూర్తోపాటు ఏపీలోని మాచర్ల వరకు రాకపోకలు, వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెరుగుతాయి. దీని కి రూ.1,160 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని గతంలో రై ల్వే శాఖ అధికారులు అంచనా వేశారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకూ వ్యాపారస్తులు ముందుకొస్తారు. ఈ రైల్వేలైన్ మొదటి దశలో భాగంగా రాయిచూర్ నుంచి గద్వాల వరకు పనులు జరిగాయి. రెండో దశ పనులు పూర్తయితే మూడు జిల్లాల అ భివృద్ధి ముఖచిత్రమే మారిపోతుంది. నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు ఈ రైల్వేలైన్పై కేంద్రానికి విన్నవించా రు. అయినా, ఎప్పటిలాగే ఇప్పుడు కూడా రైల్వేలైన్ను కేం ద్రం విస్మరించింది. రాష్ట్ర, స్థానిక బీజేపీ నాయకులు కూడా ఈ రైల్వే లైన్ను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం లేదు. ఈ క్రమం లో జాతీయ పార్టీగా అవతరించిన భారత రాష్ట్ర సమితిపై ప్రజ లు ఆశలు పెట్టుకొన్నారు. దేశ్కీ నేతగా పిలుచుకుంటున్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపితే రైల్వేలైన్ కల సాకారమవుతుందని నమ్ముతున్నారు.
గద్వాల-మాచర్ల రైల్వేలైన్ వల్ల మూడు రాష్ర్టాలతోపాటు ఉమ్మడి మహబూబ్నగర్లోని మూడు జిల్లాల మధ్య వ్యాపార, విద్యా సంబంధాలు పెరుగుతాయి. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశాలు ఉం టాయి. ప్రజలు కూడా తక్కువ వ్యయంతో ప్రయా ణించే వీలుంటుంది. కేంద్రానికి ప్రతిసారీ ఈ లైన్పై విన్నవిస్తూనే ఉన్నాం. కానీ వారు విస్మరిస్తూనే ఉన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి జాతీయ రాజకీయాల్లో బలీయశక్తిగా ఎదుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అప్పుడు రైల్వేలైన్ కచ్చితంగా సాధిస్తామన్న నమ్మకం ఉన్నది. కేంద్ర తీరును పార్లమెంట్లో గట్టిగా ప్రశ్నిస్తా.
– పోతుగంటి రాములు, ఎంపీ, నాగర్కర్నూల్