పెబ్బేరు, జనవరి 10: మండలంలోని కొల్లాపూర్ చౌరస్తాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకునట్లు ఎస్సై రామస్వామి తెలిపారు. ఆయన కథనం మేరకు మంగళవారం కొల్లాపూరు చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తుండగా పెబ్బేరుకు చెందిన సంబు వెంకటస్వామి మదనాపురానికి అక్రమంగా బియ్యం తరలిస్తునట్టు గుర్తించామన్నారు.
21క్వింటాల రేషన్ బియ్యం, బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని స్వాధీన పర్చుకొని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఆయన తెలిపారు. సివిల్ సప్లయ్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.