ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం దేశభక్తి ఉప్పొంగింది. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వాడవాడలా జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ప్రభాతభేరిలో చిన్నారుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. వనపర్తి కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, మహబూబ్నగర్ పరేడ్ గ్రౌండ్లో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, నాగర్కర్నూల్ పరేడ్ గ్రౌండ్లో విప్ గువ్వల బాలరాజు, గద్వాల పరేడ్ గ్రౌండ్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, నారాయణపేట పరేడ్ గ్రౌండ్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి జెండావిష్కరణ చేశారు. అలాగే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జాతీయ పతాకాన్ని ఎగురవేసి సెల్యూట్ చేశారు. ఆయా జిల్లాకేంద్రాల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
– మహబూబ్నగర్ నెట్వర్క్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ)
జిల్లాకేంద్రం, మండలాలు, ఆయా గ్రామాల్లో మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థల కార్యాలయాలు, పాఠశాలలు, ఆయా సంఘాల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థులు దేశ నాయకుల వేషధారణతో ప్రభాతభేరిలో పాల్గొని ఆకట్టుకున్నారు. ప్రజాప్రతినిధులు మహనీయుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయా పార్టీల కార్యాలయాల్లో పార్టీ జిల్లా, మండల, గ్రామ బాధ్యులు జాతీయ జెండా ఎగురవేసి వందనం సమర్పించారు.
జిల్లా వ్యాప్తంగా మంగళవారం స్వాతత్య్రదినోత్స వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాడవాడన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల నామ స్మరణతో ప్రభాతభేరీ నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
– నారాయణపేట నెట్వర్క్ (నమస్తే తెలంగాణ) , ఆగస్టు 15