భూత్పూర్, జూన్ 29 : బీఆర్ఎస్ కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. సోమవారం అన్నాసాగర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆల తన నివాసంలో భట్టుపల్లి, వెల్కిచర్ల, మహబూబ్నగర్ రూరల్ మండలంలోని ఇప్పలపల్లి గ్రామాల కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. ముఖ్యంగా రైతుభరోసా మూడు పంటలకు, రైతుబీమా, కల్యాణలక్ష్మి పథకం ద్వారా తులం బంగా రం, మహిళలకు నెలకు రూ.2500లు, వృద్ధులకు రూ.4000పింఛన్, దివ్యాంగులకు రూ.6000లు ఇస్తానని మాయమాటలు చెప్పి రేవంత్రెడ్డి సీఎం అయ్యారని అన్నారు.
కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అదేవిధంగా సర్పై బీఆర్ఎస్ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ముందుగా మన కార్యకర్తల ఓట్లు, పార్టీకి వచ్చే ఓట్లు పోకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్గౌడ్, సర్పంచ్ ఆల శ్రీకాంత్రెడ్డి, మాజీ సర్పంచులు సత్తూర్ నారాయణగౌడ్, మనెమోని సత్యనారాయణ, నర్సింహాగౌడ్, నాగయ్య, వెంకట య్య, బాలస్వామి, నాయకులు సత్యనారాయణ, మురళీధర్గౌడ్, జక్కిరెడ్డి, గోపాల్రాజు, గౌస్ తదితరులు పాల్గొన్నారు.