మహ్మదాబాద్, డిసెంబర్ 16 : పేదల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. మహ్మదాబాద్ తాసిల్దార్ కార్యాలయంలో గురువారం ఉమ్మడి గండీడ్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్నారని తెలిపారు. పథకంతో తల్లిదండ్రులకు ఆడపిల్లల పెండ్లి భారం తగ్గిందన్నారు.
ఎవరి ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ ఫలాలను అందిస్తున్నట్లు చెప్పారు. పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. మహ్మదాబాద్లో జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా ఓపెన్ జిమ్ను రెం డు, మూడునెలల్లో ఏర్పాటు చేయిస్తానన్నా రు. ఉర్దూమీడియం పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గండీడ్ మండలంలో 10మందికి, మహ్మదాబాద్ మండలంలో 24మందికి కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరైనట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో వైస్ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, రైతుబంధు సమి తి మండల అధ్యక్షుడు గిరిధర్రెడ్డి, సర్పంచులు పార్వతమ్మ, వెంకట్రాంరెడ్డి, కిరణ్కుమార్రెడ్డి, గీతాపాండూనాయక్, రాఘవేందర్, ఖాజా హసిబుద్దీన్, ఎంపీటీసీ చెన్న య్య, పీఏసీసీఎస్ వైస్చైర్మన్ లక్ష్మీనారాయ ణ, మాజీ సర్పంచ్ రాంలాల్, నాయకులు గోపాల్రెడ్డి, రాజేశ్వర్, తిర్మల్రెడ్డి, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు మామిళ్ల కేశవులు, ఎం పీడీవో రూపేందర్రెడ్డి, తాసిల్దార్లు జ్యోతి, ఆంజనేయులు, డిప్యూటీ తాసిల్దార్ శేఖర్, ఆర్ఐ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.