గండీడ్, డిసెంబర్ 24 : బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుడి లా పనిచేసి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని వెన్నాచేడ్ సాయిరాం ఫంక్షన్హాల్లో శనివారం బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తలు, ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వెన్నాచేడ్, జానంనల్లి, లింగాయిపల్లి, జిన్నారం, జక్లపల్లి, పెద్దవార్వల్, సాలార్నగర్, చిన్నవార్వల్, రుసుంపల్లి, రంగారెడ్డిపల్లి, కప్లాపూర్, గోవిందుపల్లి, జిన్నారంతండా తదితర గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాల్లో ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన నిధులను కేటాయిస్తున్నట్లు చె ప్పారు. సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులందరికీ అందేలా కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యానాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, పీఏసీసీఎస్ వైస్చైర్మన్ లక్ష్మీనారాయణ, వైస్ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు జిన్నారం గోపాల్, వెన్నాచేడ్ రాంరెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు గోపాల్, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్, గోపాల్రెడ్డి, బీఆర్ఎస్ మహ్మదాబాద్ మండల అధ్యక్షుడు భిక్షపతి, కప్లాపూర్ బాలవర్ధన్రెడ్డి, బోడి వెంకటయ్య, బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు వెంకట్రాములు, ఎంపీటీసీ రేణుక, అశోక్గౌడ్ ఉన్నారు.
అయ్యప్ప మహాపడి పూజకు హాజరు కావాలని ఆహ్వానం
మహ్మదాబాద్, డిసెంబర్ 24 : మండలకేంద్రంలో 29న నిర్వహించనున్న అయ్యప్ప మహాపడి పూజకు రావాలని శనివారం ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డికి అయ్యప్ప మాలధారులు ఆహ్వాన పత్రికను అందజేశారు. మహ్మదాబాద్ కాంతిమాలకొండపై అయ్యప్ప మహాపడి పూజ నిర్వహించనున్నట్లు గురుస్వామి రాజుగౌడ్ తెలిపారు. కార్యక్రమంలో గురుస్వాములు చెన్నయ్య, గోపాల్, పాండూనాయక్, రాజూనాయక్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.