పర్యవేక్షించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
జడ్చర్ల, జూన్ 14 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణప్రగతి పనులు మంగళవారం ముమ్మరంగా కొనసాగాయి. పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటేందుకు గుంతలు తీయడం, మొక్కల వద్ద పాదుల ఏర్పాటు, మురుగుకాల్వల్లో చెత్తాచెదారం తొలగింపు తదితర పనులను చేపట్టారు. జడ్చర్ల మండలంలోని మాచా రం, పెద్దపల్లి, చిన్నపల్లి గ్రామాల్లో పల్లెప్రగ తి పనులను ఏపీడీ జకియాసుల్తానా పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కలు నా టేందుకు తీసిన గుంతలతోపాటు పల్లెప్రకృ తి వనాలు, నర్సరీలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచులు రవీందర్రెడ్డి, సంగీత, శ్రీనివాస్యాదవ్, రాజేశ్వర్రెడ్డి, ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీవో జగదీశ్ పాల్గొన్నారు.
గండీడ్ : పగిడ్యాల్లో పల్లెప్రగతి పనులను పరిశీలిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు
జడ్చర్ల : మాచారంలో పల్లెప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న ఏపీడీ జకియాసుల్తానా
పల్లెల్లో ఆహ్లాదకర వాతావరణం
గండీడ్, జూన్ 14 : పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నదని జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి అన్నా రు. మండలంలోని పగిడ్యాల్లో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో మురుగుకాల్వలు, రోడ్లను శుభ్రం చేయడంతోపాటు పిచ్చిమొక్కలను తొలగిస్తున్నట్లు తెలిపారు. అలాగే పాడుబడిన బావులు, శిథిల భవనాలను తొలగించి ప్రజలు ఆరోగ్యకరమైన వా తావరణంలో జీవించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎం పీపీ మాధవి, సర్పంచ్ రాణి, తాసిల్దార్ జ్యో తి, ఎంపీడీవో రూపేందర్రెడ్డి పాల్గొన్నారు.
ఎలాంటి ఇబ్బందులు ఏర్పడొద్దు
మహబూబ్నగర్టౌన్, జూన్ 14 : ము న్సిపాలిటీలోని వార్డుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారిశుధ్య పనులను చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ అన్నారు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా రామయ్యబౌలిలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రైనేజీల్లో మురుగు సాఫీగా దిగువకు వెళ్లేలా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీపీవో ప్రతాప్కుమార్,కౌన్సిలర్ ముస్తాక్ రషీద్ తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, జూన్ 14 : మండలంలోని చిన్నరేవల్లిలో పల్లెప్రగతి పనులను ఎంపీడీవో కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికులతో మురుగుకాల్వలను శుభ్రం చేయించారు. అలాగే పిచ్చి మొక్కల తొలగింపు పనులను చేపట్టారు. పోచమ్మగడ్డతండాలో వైకుంఠధామం వద్ద ఏర్పాటు చేసిన బోరుమోటరును ప్రారంభించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, జూన్ 14 : మండలంలోని వెల్కిచర్ల, భట్టుపల్లి గ్రామాల్లో పల్లెప్రగతి పనులను ఎంపీడీవో మున్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలు, నర్సరీలు, వైకుంఠధామాలను పరిశీలించారు. పల్లెప్రగతిలో గుర్తించిన ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్ర త్యేకాధికారి సాయిబాబా, ఎంపీవో విజయకుమార్, సర్పంచులు పద్మాజక్కిరెడ్డి, ఆంజనేయులు, సీహెచ్వో రామయ్య, సీఆర్పీ ఇక్రాం తదితరులు పాల్గొన్నారు.