మహబూబ్నగర్ అర్బన్, ఫిబ్రవరి 4 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని.. కేసీఆర్ ప్రభుత్వమే బాగుండేది అని పాలమూరువాసులు చె బుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కోయిలకొండ ఎక్స్రోడ్, హన్వాడ మండలకేంద్రంలో ఆదివారం మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పర్యటించా రు. సామాన్య ప్రజలతో కలిసిపోయి ముచ్చటించారు. హోటల్లో చాయ్ తాగుతూ.. బజ్జీలు తింటూ వారి లో ఒకరిగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రెండు నెలల నుంచి టైంకు పింఛన్ రా వడం లేదని..
కేసీఆర్ సార్ ఉన్నప్పుడు సమయానికి వచ్చేదని.. పైసల కోసం ఎవరి వద్ద చేయి చాచే వాళ్లం కాదన్నారు. వ్యవసాయానికి కరెంట్ కూడా సరిగ్గా ఇ వ్వడం లేదని.. పంటలకు నీరు సరిపోవడం లేదని వాపోయారు. గ్రామాల్లో తాగునీటి సమస్య మొదలైందని.. బీఆర్ఎస్ హయాంలో రోజూ నీళ్లు వచ్చేవన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నమ్మి మో సపోయామని, కేసీఆర్ ప్రభుత్వమే బాగుండేదని చెప్పడంతో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మళ్లీ మంచి రోజులు వస్తాయని వారికి భరోసా కల్పించారు. ఆయ న వెంట ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి కూడా ఉన్నారు.