మహబూబ్నగర్, జనవరి 18 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని.. ఈ పరిస్థితి రాష్ట్రంలో కొనసాగితే కేవలం ఆరు నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే పరిస్థితి రావడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మహబూబ్నగర్ పార్లమెం ట్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ హస్తం పార్టీ ప్రభు త్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే.. సమాజంలోని అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్ర భుత్వం ఇచ్చిన హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు.. కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. రైతు రుణమాఫీ గురించి రేవంత్రెడ్డి పదేపదే చెప్పాడు.. ఒకటేసారి రుణమాఫీ చేస్తా అని చెప్పిన ఆయన మాటలకు భిన్నంగా ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి దశల వారీగా రుణమాఫీ చేస్తామని చెబుతున్నారని, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రైతుబంధు రూ.10,000 కాదు, రూ.15000 ఇస్తామన్నా.. నేటికీ రైతుల ఖాతాల్లో పడలేదన్నారు. రూ.2వేల పింఛ న్ను రూ.4 వేలు చేస్తా అన్నా నేటికీ అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. గతంలో రోజుకు పది లక్షల మం ది చొప్పున వారం రోజుల్లో 70 లక్షల మందికి పంట పెట్టుబడి సాయం అందించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా రైతుబంధు ఖా తాల్లోకి ఇంకా వస్తలేదన్నారు. ఎరువుల కోసం లైన్లో నిలబడే పరిస్థితులు మళ్లీ వచ్చినయ్.. ఎరువులను పోలీస్స్టేషన్లో పెట్టి పంచే పరిస్థితి మళ్లా వచ్చిందన్నారు. ఇలాంటి విషయాలను రైతులకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందని దిశానిర్దేశం చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధిస్తామని చెప్పారు.. మొన్న రేవంత్రెడ్డి, ఉత్తమ్ కు మార్రెడ్డి ఇద్దరూ కేంద్ర జలవనరుల మంత్రిని కలిసిన తర్వాత జాతీయ హోదా ఇవ్వడానికి వీలులేదని చెప్పారని అన్నారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా మా వల్ల కాదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది.. ఈ విషయాన్ని మహబూబ్నగర్ ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. పాలమూరుకు పక్కనే ఉన్న కర్ణాటకలో ఉన్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చిన బీజేపీ సర్కారును నిలదీసే ప్రయత్నం ఉత్తమ్, రేవంత్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్కు గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి దాకా పెద్ద ఎత్తున అన్ని స్థాయిలలో ప్రాతినిథ్యం ఉన్నదని కేటీఆర్ గుర్తు చేశారు. గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ప్రతి చోట పార్టీకి బలమైన నాయకత్వం ఉన్నద ని, ఇంతటి బలీయమైన పార్టీ తిరిగి గెలుపు బాట పట్ట డం పెద్ద కష్టమేమీ కాదన్నారు. పార్టీపైన గతంలో జరిగిన దుష్ప్రచారాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మన పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ప్ర భుత్వ ఉద్యోగాలు, రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజలకు అందించినా మనపై అసత్య ప్ర చారం జరిగిందని, దీన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చా రు. ప్రభుత్వం, పార్టీ అనే తేడాను ప్రజలు తెలుసుకోలేకపోయారు.. ప్రజల కోసం చేసిన కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ ద్వారా జరిగాయన్న విషయాన్ని వివరంగా చెప్పలేకపోయామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పింఛన్ల కోసం ఏటా రూ.800 కోట్లు ఖర్చుపెడితే.. మన ప్రభుత్వం రూ.11,700 కోట్లను ఏటా ఖర్చు పెట్టిందన్నారు. ఇంత భారీగా పింఛన్లు, సంక్షేమ కార్యక్రమాలు అందించినా చెప్పుకోవడంలో కొంత విఫలమయ్యామన్నారు.
అన్ని స్థాయిల్లో నూతన కమిటీలను ఎన్నుకొని నిరంతరం అన్ని అంశాలపై శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాల మే రకు కార్యక్రమాల రూపకల్పన జరుగుతుందన్నారు. గెలిచినప్పుడు పొంగిపోలేదు.. ఓటమికి కుంగిపోము.. ఎప్పుడైనా మా పార్టీ ప్రజల కోసం.. ప్రజాప్రయోజనాల కోసమే.. పని చేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ శ్వేత పత్రాలతో నాటకాలు మొదలుపెట్టిందని ధ్వజమెత్తారు. పదేండ్లు ప్రజలందరితో కలిసి కష్టపడి, చెమటోడ్చి తెలంగాణ కోసం చేసిన అభివృద్ధి ని, ఆస్తుల రూపకల్పనను స్వేదపత్రం పేరుతో మనం ప్రకటించామని చెప్పారు. అప్పులు కాదు.. ఆస్తుల సృ ష్టించాం.. బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని కాంగ్రెస్కు అప్పజెప్పామని గుర్తు చేశారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా.. గ్రామం నుంచి హైదరాబాద్ దాకా ప్రతి చోటా అనేక వేల కోట్ల ఆస్తులను సృష్టించామన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రె డ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.