మహబూబ్నగర్, డిసెంబర్ 2 : మహబూబ్నగర్ పట్టణమంతా పరిశుభ్రంగా మారింది. సీఎం కేసీఆర్కు ఘన స్వా గతం పలికేందుకు పాలమూరు సిద్ధమవుతున్నది. సమీకృత కలెక్టరేట్, మినీ శిల్పరామం, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపనతోపా టు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. పట్టణంలో అక్కడక్కడ ప్యాచ్లు ఉన్న రోడ్లను పూర్తిస్థాయిలో అధికారులు వేస్తున్నారు. ఎంవీఎస్ కళాశాల వద్ద నిర్వహించనున్న బహిరంగ సభకు అవసరమైన ఏర్పాట్లను ముమ్మ రం చేస్తున్నారు. అవెన్యూ ప్లాంటేషన్తోపాటు ఎలాంటి ఇ బ్బందులు లేకుండా పక్కా ప్రణాళికలతో శుక్రవారం మంత్రి శ్రీనివాస్గౌడ్, కలెక్టర్ వెంకట్రావు పర్యవేక్షించారు. ఇప్పటికే సింహభాగం ఏర్పాట్లు పూర్తి చేసుకున్న పాలమూరు తుది మెరుగులు దిద్దుకుంటుంది.