భూత్పూర్/కొత్తకోట, నవంబర్ 30 : అభివృద్ధికి ఆకర్షితులై ఆ యా పార్టీల నాయకులు టీఆర్ఎస్లోకి వలసలు వస్తున్నారని ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే నివాసంలో కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు 52 మంది డీసీసీబీ మాజీ డైరెక్టర్ రావుల సురేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఎ మ్మెల్యే ఆల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ కొత్త, పాత తేడా లేకుండా అందరూ కలుపు కొని పోవాలన్నారు. ఈ నెల 4వ తేదీన మహబూబ్నగర్లో జరగ నున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆల పిలుపునిచ్చారు.
పార్టీలో చేరిన వారిలో శ్రీనివాసులు, రాములు, బాలు, శివకుమార్, సత్యం, సుందర్, రాము, పెద్దరాములు, జగదీశ్, రాజశేఖర్, బాలస్వామి, ప్రమోద్, ప్రకాశ్, వినోద్ తదితరులు ఉన్నారు. మహబూబ్నగర్ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, వనపర్తి జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బ స్వరాజ్గౌడ్, ఎంపీపీలు మౌనిక, శేఖర్రెడ్డి, నాగార్జునరెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీలు రాజశేఖర్రెడ్డి, ఇంద్రయ్యసాగర్, మండలాల అధ్యక్షులు నర్సింహారెడ్డి, లక్ష్మీనర్సింహాయాదవ్, నాయకులు నారాయణగౌడ్, బాల్నారాయణ, శ్రీకాంత్యాదవ్, మహమూద్, తిరుపతిరెడ్డి, ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి ప్రశాంత్ పాల్గొన్నారు.