మహబూబ్నగర్ మెట్టుగడ్డ,జనవరి 27 ; తలుపులు బద్ధలు కొట్టాల్సిన పనిలేదు.. తాళాలు పగులగొట్టాల్సిన అవసరమే రాదు.. అసలు కాలు బయట పెట్టకుండానే కావాల్సినంత దోచేసు కోవడంలో సైబర్ నేరగాళ్లు ఆరితేరారు. కంప్యూటర్ జ్ఞానంతో.. నాలుగు మాయమాటలు చెప్పగలిగిన నేర్పుతో సరిహద్దులతో సంబంధం లేకుండా బ్యాంకు తాళాలు కొల్లగొట్టే స్తున్నారు. 2022లో దేశంలో సైబర్ నేరగాళ్లు రూ.లక్ష కోట్లకు పైగా దోచుకున్నట్లు అంచనా. బ్యాంకులు సాఫ్ట్వేర్ సంస్థలే కాదు గ్రామీణ ప్రాంతాల్లోని వారు సైతం సైబర్ నేరాల బారిన పడుతున్నారు. ఇంటర్నెట్ వాడకంతోపాటు కేటుగాళ్ల పరిధి పెరుగుతోంది. వారికి చిక్కకుండా మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
సైబర్ ముప్పు.. పారాహుషారు మస్ట్..కంప్యూటర్లు జాగ్రత్త..
వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు, తమ కంప్యూటర్లు, ల్యాప్ట్యాప్లు, ఫోన్లు అత్యంత భద్రంగా చూసుకోవాలి. సమాచార చౌర్యానికి పాల్పడే యాప్లు ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకుంటే కీలక సమా చారం దొంగలపాలైనట్లే, నగదు లావాదేవీలను ఇరు వ ర్గాలూ ఫోన్లో సంప్రదించి నిర్ధారణ చేసుకోవాలి.
ఖాతా మార్చి.. ఏ మార్చి..
వ్యాపార సంస్థకు సరుకులు సరఫరా చేసే డీలర్లు స మాచారాన్ని చౌర్యం చేస్తూ నేరాలకు పాల్పడుతున్నా రు. తొలుత డీలర్ మెయిల్లోకి చొరబడి. సరుకులు కొనుగోలు చేసిన సంస్థకు ఈ నెంబర్ పంపుతారు. అనివార్య కారణాల వల్ల బ్యాంకు ఖాతా మార్చుకున్నామ ని, తమకు రావాల్సిన బకాయిని కొత్త ఖాతాకు బదిలీ చేయాలని అందులో పేర్కొంటారు. తమకు తెలిసిన డీలర్ ఈ మెయిల్, చిరునామా నుంచే మెయిల్ రావడంతో సంస్థ సిబ్బంది నిజమేనని నమ్మి.. ఆ మేరకు కొత్త ఖాతాకు నగదు బదిలీ చేసి మోసపోతున్నారు.
కేవైసీ.. వారికి ఓ వరం..
ఖాతాదారుడి గురించి తెలుసుకునేందుకు బ్యాంకు లు పాటిస్తున్న కేవైసీ నిబంధన సైబర్ నేరగాళ్లకు ఓ పనైంది. వినియోగదారులకు ఫోన్ చేసి కేవైసీ వివరాలు నమోదు చేయాలని, లేకపోతే సేవలు నిలిపివేస్తామంటారు. వివరాల నమోదుకు లింకు పంపుతారు. దాన్ని తెరవగానే కంప్యూటర్ ఎనీడెస్క్ వంటి సాఫ్ట్వేర్లు లోడ్ అవుతాయి. ఆ క్షణం నుంచి మీ ఫోన్ నేరగాళ్ల అధీనంలోకి వెళ్లినట్లే. కేవైసీ అప్డేట్తో డెబిట్, క్రెడిట్ కార్డు నెంబర్లతోపాటు సీవీవీ నెంబర్నూ నమోదు చేయాలంటారు. అప్పటికే బాధితుల ఫోన్ నేరగాళ్ల ఆధీనంలో ఉంటుంది. కాబట్టి దానికి వచ్చే ఓటీపీలు వారికి కనిపిస్తుంటాయి. వాటితో ఖాతాల్లోని డబ్బులను దోచేస్తారు.
వాహనాలు కొంటామంటూ..
వాహనం అమ్ముతాం.. అని మనం ఆన్లైన్లో ప్రకటన పెట్టగానే సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తారు. తాము కొ ంటామంటారు. వాహనం ఆర్సీ, యజమాని ఆధార్కార్డు వంటివి పంపాలని కోరతారు. ఆ తర్వాత ఓ రూ. 10 వేలు అడ్వాన్సు ఇస్తున్నానంటూ నేరగాడు ఒక కోడ్ పంపుతాడు. దాన్ని తెరిస్తే డబ్బు జమ అవుతుందంటా డు. అమ్మకం దారు ఆ క్యూఆర్కోడ్ తెరవగానే లావాదేవి కొనసాగించాలా? అని అడుగుతుంది. డబ్బు జమ అవుతుంది. కదా అని వాహనం యజమాని సరే అం టాడు. ఆ వెంటనే అతని ఫోన్లో ఉన్న యూపీఐ యా ప్ ద్వారా రూ.10 వేలు సైబర్ నేరగాడి ఖాతాలో జమ అ వుతాయి. ఆ విషయం సైబర్ నేరగాడికి చెబితే పొరపా టు జరిగిందని, రూ.10 వేలకు మరో రూ.10 వేలు క లిపి మొత్తం రూ.20 వేలు ఇస్తానని చెబుతూ మరో క్యూఆర్కోడ్ పంపుతాడు. దాన్ని తెరిస్తే మరో రూ.20 వేలు గల్లంతయినట్లే. ఈ కథ అంతటితో ముగిసిపోదు. ఆర్సీ, ఆధార్ కార్డు వివరాలతో మరో మోసానికి తెర లే పుతారు. కనుక సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది.
వాయిస్ క్లోనింగ్తో మోసాలు..
క్రెడిట్ కార్డు, సిమ్ కార్డుల క్లోనింగ్ దశలను దాటిపోయిన నేరగాళ్లు వాయిస్ క్లోనింగ్కు పాల్పడుతున్నారు. ఇటీవల ఇంగ్లాండ్లో ప్రైవేట్ సంస్థకు చెందిన సీఈవో గొంతు క్లోనింగ్ చేశారు. అచ్చం ఆయనలా మాట్లాడి పలానా సంస్థకు బకాయిలు చెల్లించాలని చెబుతూ అకౌంట్స్ అధికారిని బురిడి కొట్టించి రూ.కోట్లు కొల్లగొట్టారు. డబ్బు బదిలీ చేసిన సిబ్బంది ఆ తర్వాత విషయం తెలిసి నివ్వెరపోయారు. వ్యాపార సంస్థలే లక్ష్యంగా ఈ తరహా మోసాలు సాగుతున్నాయి. రాబోయే రోజుల్లో కుమారుడు మాట్లాడుతున్నట్లు తండ్రికి ఫోన్ చేసి డబ్బులు అడగొచ్చు. ఇప్పటికే ప్రముఖుల పేరుతో పేస్బుక్ ఖాతాలు తెరిచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న ఉదంతాలు నమోదవుతున్నాయి.
అప్రమత్తంగా ఉండాలి..
సైబర్ నేరగాళ్లను కట్టడి చేసేందుకు పోలీసుశాఖ నిఘా ఉంచింది. సైబర్ నేరగాళ్ల బారినపడి వ్యక్తులే కాదు. పెద్దపెద్ద సంస్థలు, బ్యాంకులు భారీగా నష్టపోతున్నాయి. వీరినుంచి తమను తా ము కాపాడుకోవాలంటే ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాల్సిందే. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి. డబ్బు లావాదేవీలకు సంబంధించి ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలి. ప్రజలు తమ బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పంచుకోవద్దు.
– హర్షవర్ధన్, మహబూబ్నగర్ ఎస్పీ
బహుమతి వచ్చిందంటూ..
బహుమతి వచ్చిందని ఈ మొయిల్ ద్వారా చేసే మోసం, అదే తరహాలో ఫోన్ చేసి మోసగిస్తే ఇప్పుడు కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. అదే ఈ పద్ధతిలో క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లు పొందాలంటే ఈ దిగువ లింక్ను క్లిక్ చేయాలని సంక్షిప్త సందేశం వస్తుంది. ఆశతో దాన్ని క్లిక్ చేస్తే తెరపై చిన్న పట్టిక కనిపిస్తుంది. క్రెడిట్ కార్డు నెంబరు, వినియోగదారుడి పేరు, కార్డు గడువు ముగిసే తేదీ, సీవీవీ నెంబర్ పేర్కొనాలని, అప్పుడే పాయింట్లు వస్తాయని సందేశం కనిపిస్తుంది. అన్ని నమోదు చేశాక మీకు ఒక పిన్ నెంబరు వస్తుందని దాన్ని కస్టమర్కేర్ నుంచి ఫోన్ చేసే వారికి చెప్పాలని అప్పుడే పాయింట్లు వస్తాయని సందేశం కనిపిస్తుంది. రికార్డు పాయింట్లు ఆశతో వారి ఉచ్చులో పడితే మీ క్రెడిట్ కార్డు ఖాళీ అవుతుంది.
అడగ్గానే డబ్బులు పంపొద్దు..
కుటుంబ సభ్యులైనా, కార్యాలయ సిబ్బంది అయినా ఫోన్లో డబ్బు అడగ్గానే బదిలీ చేయవద్దు. మళ్లీ ఒకసారి వారి నెంబర్లకు ఫోన్ చేసి నిర్ధారించుకోవాలి. ఫోన్లో వచ్చిన ఆదేశాలు విజ్ఞప్తుల ఆధారంగా పెద్ద మొత్తంలో నిధులు అసలే పంపించొద్దు.
కార్డు వివరాలు నమోదు చేయొద్దు..
రివార్డు పాయింట్ల కోసం ఏ బ్యాంక్ కూడా లింకులు పంపదు. ఒకవేళ ఎవరైనా లింకులు పంపినా.. ఎట్టి పరిస్థితుల్లో క్రెడిట్ కార్టు వివరాలు నింపొద్దు. సీవీవీ నెంబర్ ఎవరికీ చెప్పొద్దు. పిన్ వినియోగదారుడి సొంతం.