అయిజ, జూన్ 15 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. ఆదివారం జూరాల ప్రాజెక్టుకు 20వేల క్యూసెక్కు ల ఇన్ఫ్లో ఉండగా, నెట్టెంపాడ్ ఎత్తిపోతల ప థకం1500, కోయిల్సాగర్ లిఫ్టుకు 315, విద్యు త్ ఉత్పత్తికి 19,805 క్యూసెక్కులు విడుదల చేయగా మొత్తం అవుట్ ఫ్లో 21,677 క్యూసెక్కులు నమోదైంది. పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.019 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది.
తుంగభద్ర డ్యాంకు ఇన్ఫ్లో 8,585 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 178 క్యూసెక్కులు నమోదైంది. గరిష్ఠ నీటిమట్టం1633 అడుగులకు గానూ ప్రస్తుతం 1603.82 అడుగుల నీటిమట్టం ఉండగా, 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 26.873 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. అలాగే కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద చేరుతోంది. ఇన్ఫ్లో 5,455 క్యూసెక్కులు ఉండగా, దిగువన ఉన్న సుంకేసుల బారాజ్కు 5,131 క్యూసెక్కులు చేరుతుండగా, ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 324 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆర్డీఎస్ ఆనకట్టలో ప్రస్తుతం 8.7 అడుగుల మేర నీటి మట్టం ఉన్నది.