వనపర్తి/వనపర్తి రూరల్ , జూన్ 5 : “ఉమ్మడి రాష్ట్రం లో విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు.. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా రైతులు వ్యవసాయ పొలాలకు టార్చిలైట్లు వేసుకొని వెళ్లేవారు.. పారిశ్రామిక రంగాలు విద్యుత్ సెలవులు పాటిం చే దుస్థితి ఉండేది.. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు” అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని కల్యాణసాయి గార్డెన్స్లో విద్యుత్ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ముందుగా జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, విద్యుత్శాఖ అధికారులతో కలిసి మంత్రి నిరంజన్రెడ్డి జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం విద్యుత్శాఖ ఎస్ఈ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1974లో గృహ అవసరాల నిమిత్తం కరెంటు వాడకం మొదలుపెడితే 1983 వరకు ఆయిల్ ఇంజన్లతో బావుల నుంచి నీటిని తోడుకునేవారని గుర్తుచేశారు. 1983లో అప్పటి కేంద్రమంత్రికి మా నాన్నతోపా టు 11మంది రైతులు వ్యవసాయానికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కావాలని కోరితే అది రావడానికి ఏడాదిన్నర కాలం పట్టిందని మంత్రి వివరించారు.
తెలంగాణ రాకముందు 16లక్షల మోటర్లకు విద్యుత్ కనెక్షన్లు ఉండగా, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 28లక్షలకు కనెక్షన్లు పెరిగాయన్నారు. ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తే 10-12 గ్రా మాల ప్రజలకు లోవోల్టేజీ సమస్య ఉండదని, అలాంటి సబ్స్టేషన్ను ఏర్పాటు చేయాలంటే ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే పదవీకాలం మొత్తంలో ఒకటి లేదా రెండు మంజూరు కావడమే గగనంగా ఉండేదన్నారు. తెలంగాణ వచ్చాక తొమ్మిదేండ్ల కాలంలో వనపర్తి నియోజకవర్గానికి 24 సబ్స్టేషన్లు మంజూరు కాగా, అందులో 12 సబ్స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. మరో 12 సబ్స్టేషన్ల పనులు చివరి దశలో ఉన్నాయని వివరించా రు. విద్యుత్శాఖ ఉద్యోగులు 24 గంటలు తమ ప్రా ణాలను పణంగా పెట్టి పని చేస్తారని, వారి కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్.. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా విద్యుత్ అధికారులకు అత్యధిక జీతాలు ఇస్తున్నట్లు తెలిపారు. విద్యుత్శాఖలో లైన్ఉమెన్లను నియమించిన ఘనత మనకే దక్కిందన్నారు. విద్యుత్ సరఫరాలో అం తరాయం ఏర్పడకుండా అధికారులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తారని, వారి సేవలను అందరూ గౌరవించాలని కోరారు.
దేశంలో సగటున 1255 యూనిట్ల విద్యుత్ వినియోగమవుతుందని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. తెలంగాణ రాకముందు సగటున 1356 యూనిట్లు వినియోగించగా, రాష్ట్రం వచ్చాక సగటున 2126 యూనిట్ల విద్యుత్ వాడకం పెరిగిందన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ విద్యుత్శాఖ మంత్రులను కలిసి మాట్లాడినప్పుడు కేవ లం 5లక్షల మంది రైతులు మాత్రమే కరెంటు మోటర్లు వినియోగిస్తున్నారని, దాదాపు 20లక్షల నుంచి 25లక్షల మంది రైతులు ఇప్పటికీ వ్యవసాయానికి ఆయిల్ ఇం జన్లు వాడుతున్నారని చెప్పారని తెలిపారు. దేశవ్యాప్తంగా 5లక్షల 50వేల గ్రామాలు ఉండగా, ఇప్పటికీ లక్షన్నర గ్రామాల్లో విద్యుత్ బల్బులు లేవన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో విద్యుత్ బల్బులను ఏర్పాటు చేయించడం హర్షించదగిన విషయమని చెప్పుకున్న సందర్భాలను మంత్రి గుర్తు చేశారు. కాగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా వ్యాసరచన తదితర పోటీల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు.
అంతకుముందు విద్యుత్శాఖ ప్రగతి కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ తేజస్ నందలాల్ పవా ర్ మాట్లాడుతూ తెలంగాణలో ఒకప్పుడు స్థిరమైన విద్యు త్ వ్యవస్థ లేకపోవడంవల్ల వ్యవసాయం దీనస్థితిలో ఉం డేదన్నారు. ప్రస్తుతం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. అట్టడుగుస్థాయి నుంచి ఉన్నతస్థాయికి విద్యుత్ రంగం అభివృద్ధి చెందడంలో అధికారుల కృషి ఎంతో ఉందన్నారు. జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, మున్సిపల్ చైర్మ న్ గట్టుయాదవ్ మాట్లాడుతూ నిరంతర వి ద్యుత్ సరఫరాతో అన్ని రంగాలు పురోభివృద్ధి సాధిస్తున్నాయని తెలిపారు. సాగునీరు, విద్యుత్ ప్రమాణికంగా దేశవిదేశాల నుంచి పరిశ్రమలు వస్తున్నాయని వివరించారు. సీఎం కేసీఆర్ దూరదృష్టిలో విద్యుత్రంగాన్ని తీర్చిదిద్దారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్ కమిటి చైర్మన్ రమేశ్గౌడ్ పాల్గొన్నారు.