పాలమూరు, మార్చి 19 : ప్రభుత్వ ఆదేశాల మేరకు మన్యంకొండలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులను మంగళవారం దేవాదాయశాఖ స్తపతి వల్లినాగయుగం, ఎస్ఈ మల్లికార్జున్రెడ్డి, డీఈ శర్మ, ఏఈ బాలయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మధుసూదన్కుమా ర్, ఈవో శ్రీనివాసరాజు ఆలయం వద్ద నూతనంగా చేపట్టిన ప్రాకార నిర్మాణం, కల్యాణ మండపం, కొండపై భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పా టు చేసి క్యూలు, లడ్డూ ప్రసాద కౌంటర్లు, అన్నదాన గదుల నిర్మాణానికి సంబంధించిన పనులను అధికారులకు వివరించారు. అంతకుముందు వారు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆల య పర్యవేక్షకుడు నిత్యానందచారితోపాటు ఆలయ సిబ్బంది ఉన్నారు.