కొల్లాపూర్ రూరల్, డిసెంబరు 14 : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో దట్టమైన నల్లమల అభయఅరణ్యాన్ని చీల్చుకుంటూ కృష్ణానది ప్రవహిస్తున్నది. ఇక్కడ గతంలో కంటే పులుల సంఖ్య పెరిగినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు చీమలు దూరని చిట్టడవీలోకి అక్రమ కలప రవాణా చేయడంతో జంతువులు వలసబాట పట్టాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఫారెస్ట్ అధికారులు టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసి కలప స్మగర్లపై పీడీ యాక్ట్ నమోదు చేయడంతో పూర్తిగా అక్రమ కలప రవాణాకు అడ్డుకట్టపడింది. దీంతో కొల్లాపూర్ ఫా రెస్ట్ రెయింజ్ పరిధిలో 36,872 హెక్టర్లలో దట్టమైన అభయారణ్యం విస్తరించింది. కెమెరాల్లో రికార్డు అయిన పులుల సంఖ్య 13 వరకు ఉందని, డీప్ ఫారెస్ట్లో పులుల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మైదాన ప్రాంతాలకు సరిహద్దులో అడవి జంతువులు మైదాన ప్రాంతంలోకి రాకుండా చుట్టూ కందకాలను తీశారు. కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని అంకిల్పెంట, పెద్దూటి, జాలిపెంట, ఎర్రపెంట, ఎన్కామానుపెంట పెంట, ఎర్రగూడెం పెంట, రేలాపాడు ఏరియాల్లో నల్లమలలోకి ప్రవేశించేందుకు ఫారెస్ట్ అధికారులకు కూడా కష్టసాధ్యమైన పని. కానీ సాధ్యమైన వరకు నీటి తొట్లను, కెమెరాలను ఏర్పాటు చేశారు. శాఖాహార జంతువుల కోసం కొన్ని చోట్ల ప్రత్యేకమైన సీడ్తో గడ్డి పెంచారు. ఫారెస్ట్ అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేయగా, జంతువుల సంఖ్య పెరిగి అటవిని దాటి బయటకు వచ్చేందుకు జంతువులు ప్రయత్నం చేస్తున్నాయి.
నల్లమల అభయారణ్యానికి ఆనుకొని కృష్ణానది ప్రవాహిస్తుండడంతో తాగునీటి కోసం జంతువులు ఒడ్డుకు చేరుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని ఫారెస్ట్ మైదాన ప్రాంతాలకు అతి సమీపంలో ఉండడంతోపాటు నల్లమలకు నివాస గ్రామాలు ఉండడం, వాటికి ఆహారం సరిగా లభించకపోవడంతో కొన్ని పులులు కొల్లాపూర్ ఫారెస్ రేంజ్ పరిధిలోకి వస్తున్నాయి. ఇటీవల మంగళవారం అమరగిరి చెంచుగూడెం సమీపంలో కనిపించిన పెద్దపులి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నల్లమలకు ఆనుకొని కృష్ణానది ఒడ్డున చేపల వేట సాగించే జాలర్లు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి సమయాల్లో జంతువుల బారి నుంచి తప్పించుకునేందుకు నదీతీరం వెంట మంటలు పెడుతుండడంతో జంతువులు నీటి దాహాన్ని తీర్చుకునేందుకు పగటిపూట నది ప్రవాహం వద్దకు వస్తున్నాయి. దాహర్తి కోసం వచ్చే పులులు ఎక్కడ తమపై దాడి చేస్తాయననే భయంతో జాలర్లు, చెంచులు, సమీప గ్రామాల పశువుల కాపరులు, రైతులు భయందోళనలో ఉన్నారు.
కొల్లాపూర్ నల్లమల పరిసర ప్రాం తాల్లో పులుల కదిలికలు ఉన్నాయి. పు లుల సంఖ్య కూడా పెరిగింది. సమీప గ్రా మాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనుమతులు లేకుం డా ఎవరూ అడవిలో కి ప్రవేశించకూడదు. కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం.