పెద్దమందడి, డిసెంబర్ 26 : గ్రామాల అభివృద్ధే బీఆర్ఎస్ సర్కార్ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. పెద్దమందడి మండలంలో సోమవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందన్నారు. కేవలం ఎనిమిదేండ్లలోనే ఎంతో పురోగతి సాధించామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతోపాటు కాల్వలకు మరమ్మతులు చేయడంతో పుష్కలంగా సాగునీరందుతుందని, వలసలు వెళ్లిన వారు స్వగ్రామాలకు వచ్చి పని చేసుకుంటున్నారన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ ఘనతేనని అన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అ భివృద్ధి చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్దేనని, గ్రామాలాభివృద్ధికి ప్రభుత్వం అ న్ని విధాలుగా కృషి చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. సోమవారం పెద్దమందడి మండలకేంద్రంలో గ్రామ పంచాయతీ భవనం, ఆయుర్వేద దవాఖాన అదనపు గది ప్రారంభం, డ్రైనేజీ కాల్వకు శంకుస్థాపన, మద్దిగట్లలో ఎస్సీ కమ్యూనిటీ హాల్, పీహెచ్సీ నిర్మాణానికి భూమిపూజ, అమ్మపల్లిలో బీటీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ, గట్లఖానాపూర్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్, పాఠశాల అదనపు గదులు ప్రారంభం, వాల్మీకి భవనానికి శంకుస్థాపన, మంగంపల్లిలో విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన, క్రీడా ప్రాంగణం, వైకుంఠధామం ప్రారంభం, జగత్పల్లిలో సీసీ రోడ్డు, వాల్మీకి భవనం ప్రారంభం, మనిగిల్లలో పీహెచ్సీ భవనం భూమిపూజ చే శారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్య, వైద్యం, తాగు, సాగునీరు, రహదారుల నిర్మాణం, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, పారిశుధ్య నిర్వహణకు ప్రా ధాన్యతనిస్తున్నట్లు తెలిపారు.
గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పట్టణాలపై ఒత్తిడి తగ్గిందన్నారు. మారుతున్న కాలానికనుగుణంగా గ్రామీణ జీవన విధానంలో మార్పులు వస్తున్నాయని చెప్పారు. గ్రామాలకు సాగునీరు రావడంతో ప్రతి ఒక్కరికీ చేతినిండా పనులు దొరుకుతున్నాయన్నారు. పట్టణాలకు వలసవెళ్లిన వారు కూడా తిరిగి గ్రామాలకు వచ్చి జీవనం కొనసాగిస్తున్నారన్నారు. తెలంగాణలో మాదిరిగా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఎక్కడా లేదన్నారు. లో ఓల్టేజీ సమస్యలు అధిగమించేందుకు రెండు, మూడు గ్రామాలకు కలిపి ఒక సబ్స్టేషన్ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, ఎంపీపీ మేఘారెడ్డి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజాప్రకాశ్రెడ్డి, సింగిల్విండో మాజీ అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, సత్యారెడ్డి, మాజీ ఎంపీపీ మన్యపురెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటస్వామి, సింగిల్విండో ఉపాధ్యక్షుడు కుమార్యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివశంకర్, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.