గద్వాల అర్బన్, డిసెంబర్ 1 : జిల్లాలో 2023-25 సంవత్సరానికి డిసెంబర్ 1నుంచి నూతన మద్యం పాలసీ అమలులో ఉండనుంది. రెండు సంవత్సరాల పాటు ఈ పాలసీ అమలులో ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. రెండేళ్ల పాటు కొనసాగిన మద్యం పాలసీ గురువారంతో ముగిసింది. శుక్రవారం నుంచి కొత్త మద్యం పాలసీ విధానం అమల్లోకి రానుంది. పాత మద్యం దుకాణాలు నిర్వహించే వ్యాపారులకు చాలా వరకు రాకపోవడంతో ఇకపై ఏం చేయాలనే అలోచనలో పడ్డారు. కొత్తగా దుకాణాలను సొంతం చేసుకున్న వారితో కొందరు వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నారు. 2019-2021 మద్యం షాపుల లైసెన్స్ ముగియడంతో కొత్త మద్యం దుకాణాలకు తెలంగాణ ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో 36 మద్యం షాపులకు 1,079 దరఖాస్తు చేసుకొగా.. అందులో లక్కీ డిప్ ద్వారా 36 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన వారికి మద్యం దుకాణాలకు లైసెన్స్లు మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 2017-2019 పాలసీ కాలంలో మద్యం డిపోల నుంచి రూ.600 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా, 2019 నవంబర్ నుంచి 2021 నవంబర్ 30 వరకు డిపోల నుంచి రూ.800 కోట్ల అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు వివరించారు. 2021 నవంబర్ నుంచి 2023 నవంబర్ వరకు దాదాపు రూ.1,000 కొట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం నుంచి హడావుడి మొదలైయింది.
మద్యం అమ్మకాలు నిర్వహించే దుకాణ నిర్వాహకులు తప్పనిసరిగా అబ్కా రీ శాఖ అధికారులు తెలిపిన నియమ నిబంధనలు పాటించాల్సిందే. 18 ఏం డ్ల లోపు ఉన్న బాలురకు మద్యం అమ్మరాదు. అలాగే డ్రైవర్లకు మద్యం అమ్మరాదు. అత్యధికంగా మద్యం కొనుగోళ్ల వివరాలు, మద్యానికి సంబంధించి రికార్డులు, మద్యం మీద నిర్ణయించిన ధరలకే సరఫరా చేయాలి. లే దంటే దుకాణాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం