నడిగడ్డ వరప్రదాయినిగా నెట్టెంపాడు ప్రాజెక్టుకు పేరుంది. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలకు ప్రాణధారగా నిలిచింది. ఎత్తిపోతల పరిధిలో ర్యాలంపాడు, గుడ్డెందొడ్డితోపాటు ఆరు రిజర్వాయర్లు నిర్మించగా నేడు జలకళను సంతరించు కున్నాయి. ప్యాకేజీ కెనాల్స్ తెరుచుకొని బీడు భూముల్లో నీరు పరుగులు పెడుతున్నది. నాలుగు పంపులు నీటిని ఎత్తిపోస్తుండగా.. 68 మెగావాట్ల విద్యుత్ను వినియోగి స్తున్నారు. సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. సాగునీరు పుష్కలం కావడంతో సిరుల పంటలు పండుతున్నాయి. దీంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– ధరూర్, ఏప్రిల్ 15
ధరూర్, ఏప్రిల్ 15 : నడిగడ్డ దక్షిణ ప్రాంత రైతులకు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం(లిఫ్ట్ ఇరిగేషన్) వరప్రదాయినిగా నిలుస్తున్నది. మండలంలోని రేవులపల్లి వద్ద జూరాల ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ ధరూర్ మండలకేంద్రంతోపాటు కిలోమీటరున్నర దూరంలో ఉన్న చిన్నచింతరేవుల గ్రామం కూడా చుక్క నీటికి నోచుకోని దయనీయ పరిస్థితులు ఉండేవి. జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ 2005 లో పీజేపీ అప్రోచ్ చానెల్ ద్వారా మం జూరై పనులు ప్రాంభమైనప్పటికీ 201 3 వరకు కూడా సాగునీరు అందలేదు. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ అధికాంలోకివచ్చాక సీఎం కేసీఆర్ సారథ్యంలో పంపు మోటర్లు నురగలుగక్కాయి. కాలువల్లో ని పిచ్చిమొక్కలు, పూడిక మట్టి, రాళ్లూరప్పలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. రిజర్వాయర్లు నీటితో కళకళలాడాయి. ప్యాకేజీ కెనాళ్లు తెరచుకొని సాగుభూముల కాలువల్లోకి ప్రవహించి రైతు ల కండ్లల్లో ఆనందం నింపాయి. బీడు భూములు సైతం ధాన్యపు సిరులను కు రిపించాయి.
నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా నిర్మితమైన గుడ్డెందొడ్డి బ్యాలెన్సింగ్ స్టేజ్-1 రి జర్వాయర్ 1.19 టీఎంసీల నీటిమట్టం తో 64వేల ఎకరాల ఆయకట్టును కల్గి ఉన్నది. 99ఏ ప్యాకేజీ ఎడమ కాలువ ద్వారా నీలహళ్లి, నెట్టెంపాడు, నాగర్దొ డ్డి, మాల్దొడ్డి, ద్యాగదొడ్డి, ఉప్పేరు, గార్లపాడు, ఖమ్మంపాడు గ్రామాల మీదుగా ప్రవహిస్తూ ఆరువేల ఎకరాల్లో సాగును సంబరంగా మార్చింది. 99బీసీడీ 100 కుడి కాలువ ద్వారా జీరబండ, చిన్నపా డు, మన్నాపురం, సోంపురం, పారుచర్ల, సంగాల పరుమాల, అలంపూరు నియోజకవర్గంలోని ఇటిక్యాల, వడ్డేపల్లి మండలాల వరకు 58వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. అదేవిధంగా 0.6 టీఎంసీల నీటిని సంగాల రిజర్వాయర్కు తరలిస్తున్నది. నెట్టెంపాడు రెండో రిజర్వాయర్గా నిర్మితమైన ర్యాలంపాడు బ్యాలెన్సింగ్ స్టేజ్-2 రిజర్వాయర్ 4టీఎంసీల నీటిమట్టం తో దక్షిణప్రాంత మండలాల మీదుగా ప్రవహిస్తూ గట్టు, మల్దకల్, అయిజ, కేటీదొడ్డి మండలాల్లో 1.36లక్షల ఎకరాల ఆయకట్టులో రెండు పంటలకు సరిపడా సాగునీటిని అందిస్తున్నది.
ప్రధానంగా 104ఏ ఎడమ ప్యాకేజీ కెనాల్ ద్వారా మార్లబీడు నుంచి ధరూరు, కో తులగిద్ద, అల్వాల్పాడు, కేటీదొడ్డి మండలంలోని కొండాపురం, నందిన్నె మీ దుగా 25వేల ఎకరాల ఆయకట్టుకు సా గునీరు అందిస్తున్నది. అదేవిధంగా 105, 6, 7 కుడి కాలువ ప్యాకేజీల ద్వా రా 1.11లక్షల ఎకరాల్లో ఆయకట్టును తడుపుతూ సద్దలోనిపల్లి, మల్దకల్, అ యిజ, భూంపురం, పులికల్, గట్టు, అరగిద్ద, చమన్ఖాన్దొడ్డి, టీటీదొడ్డి, చాగదొన మీదుగా ఎగువన తుంగభద్రా నది పై ఉన్న దొడ్డి సింధనూరు ప్రాజెక్టును తా కుతున్నది. తాటికుంట, నాగర్దొడ్డి, ము చ్చోనిపల్లి రిజర్వాయర్లకు 3.6 టీఎంసీల నీటిని తరలిస్తున్నది. గట్టు మండలంలో నిర్మితమవుతున్న చిన్నోనిపల్లి రిజర్వాయర్కు కూడా 1.5 టీఎంసీల నీటిని ఇక్కడి నుంచి తరలిస్తున్నారు.
రెండు పంటలకు నీరిచ్చాం
నడిగడ్డ రైతులకు ఈ రోజు సాగు నీరందుతుందంటే అందుకు ప్రభుత్వ విధివిధానాలే కారణం. సాగుపరంగా ప్రభుత్వం అన్నదాతల మనసుల్లో మమ్మల్ని తలెత్తుకునేలా చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేస్తే అప్పటి మంత్రి మా చేతులకు బేడీలు వేయించి జైల్లో పెట్టంచారు. అయినా మేము సీఎం కేసీఆర్ సహకారంతో ధైర్యంగా నిలబడి రెండు పంటలకు సాగునీరిచ్చాం. ప్రభుత్వం తరఫున అన్నదాతల మద్దతు అడిగే హక్కు మాకు ఉంది.
– ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి 12 టీఎంసీలు ఎత్తి పోశాం
నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా రెండు పంటలకు సాగునీరు అం దించడంలో ప్రభుత్వం పాత్ర అ మోఘమని చెప్పాలి. ఒక టీఎం సీ నీటిని ఎత్తిపోసేందుకు సుమా రు రూ.5కోట్లు ఖర్చవుతోంది. ఎ త్తిపోతల నిర్వహణకు 2డివిజన్ల లో ఇద్దరు ఈఈలు, పదిమంది డీఈలు, 40మంది ఏ ఈఈలు పనిచేస్తున్నారు. ప్రభుత్వ సహకారంతో రెం డు పంటలకు సాగునీరు అందించడంలో సఫలీకృతమవుతున్నాం. ఈ ఏడాది 12 టీఎంసీల నీటిని ఎత్తిపో శాం. గట్టు ఎత్తిపోతల పనుల్లో ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి పనులు ప్రారంభించాం.
– రహీముద్దీన్, నెట్టెంపాడు ఎత్తిపోతల ఈఈ అద్భుతమనే చెప్పాలి
పక్కనే జూరాల ఉన్నా మాకు నీరు అందుతుందా అని ఎదురు చూసెటోళ్లం. కేసీఆర్ సార్ సీఎం అయ్యాక ఎంత ఖర్చు చేశాడో తెల్వదు గానీ మాకు రెండు పంటలకు నీళ్లిస్తున్నడు. ఇదంతా అద్భుతమనే చెప్పాలి. ఎనిమిదేండ్లలో ధరూర్ మండల ఆయకట్టును ధాన్యపు సిరులతో నింపిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే చెందుతుంది. ప్రభుత్వం అరుతడి పంటలు వేయమని చెబుతున్నా మేం రెండు సీజన్లలో వరి వేస్తునాం. అయినా ప్రభుత్వం సాగునీటిని ఎప్పుడూ బందు చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వమంటే రైతు సర్కారనే చెప్పాలి.
– రోషన్న, ర్యాలంపాడు రిజర్వాయర్ ఆయకట్టు రైతు