మహబూబ్నగర్ కలెక్టరేట్/గద్వాలటౌన్ జూన్ 21: నీట్ యూజీ-2026 పునఃపరీక్ష ఆదివారం ఉ మ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా సజావుగా సాగిం ది. లోపాలకు తావులేకుండా ప్రతి దశలోనూ అధికా ర యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది. ప రీక్ష సమర్థ నిర్వహణకు సాయుధ పోలీసు బలగాలతో భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. మే 3న ని ర్వహించిన నీట్.. పేపర్ లీకేజీ కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 21న మళ్లీ పరీక్ష మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాల్లో ని ర్వహించారు.
మొత్తం 4291 మంది అభ్యర్థులకు గా నూ 3862 మంది హాజరు కాగా 429 మంది గైర్హాజరయ్యారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆదివారం నాలుగు పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన నీటీ పరీక్షా ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 987 మంది అభ్యర్థులు పరీక్షకు హజరుకావాల్సి ఉండగా 877మంది పరీక్షకు హాజరయ్యారు. 110 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్భూగుప్తా, ఎస్పీ డి.జానకి, అదనపు కలెక్టర్ మధుసూదన్నాయ క్, జోగుళాంబ గద్వాల జిల్లాలో జిల్లా ఎస్పీ శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ శంకర్తోపాటు జిల్లా అధికారులు తనిఖీలు నిర్వహించారు.
కట్టుదిట్టంగా నిబంధనలు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనల అ మలు కట్టుదిట్టంగా, కచ్చితమైన భద్రత ఏర్పాట్ల మ ధ్య అధికారులు కఠినంగా వ్యవహరించారు. చాలా చోట్ల పలువురు విద్యార్థినులు జడ వేసుకోకుండా రా వడంతో వారిని విధిగా జడ వేసుకోవాలని సూచించడంతో అప్పటికప్పుడు వారు సహాయకులుగా వచ్చిన వారితో, తల్లి, బంధువులతో జడ వేయించుకున్నారు. మొలత్రాడుకు తల్లిదండ్రులు గతంలో కట్టించిన తా యత్తులు, ఇతరత్రా భక్తితో కట్టించుకున్న వివిధ రకా ల దేవుళ్లకు సంబంధించిన బొమ్మలు ఉంటే వాటిని పోలీసులు తొలగించారు.
వాటర్బాటిల్ ట్రాన్స్ఫరెంట్గా ఉండాలంటూ బాటిల్పై కవర్లు సైతం తొలగించారు. కొందరు చెవులకు కమ్మలు, రింగులతో వస్తే వాటిని తొలగించిన తర్వాతే లోపలకు అనుమతించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 11గంటల నుంచే అభ్యర్థులను అన్ని విధాలుగా తనిఖీలు నిర్వహించి మధ్యాహ్ంన 1:30గంటల వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. సమయం దాటిన తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రాల లోపలకు అనుమతించలేదు. నిర్ధేశిత సమయం ముగియడంతో అభ్యర్థులు కొన్ని కేంద్రాల వద్దకు వచ్చినా వెనుదిరిగి వెళ్లడం కన్పించింది.