మరికల్, జనవరి 24 : వ్యాక్సిన్తోనే కరోనాను నియంత్రిచవచ్చని, మరోదారి లేదని, ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని డీఆర్డీవో గోపాల్నాయక్ సూచించారు. సోమవారం మండల కేంద్రంలో ఆయన బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాక్సిన్ వేసుకోవడం వల్లనే మూడో దఫాలో మరణాలరేటు తగ్గిందని తెలిపారు. రెండు డోసులు వెసుకున్నవారు బూస్టర్డోస్ వేసుకోవాలన్నారు. ప్రజలు కచ్చితంగా వ్యాక్సిన్ వేసుకుంటే ప్రాణాలకు రక్షణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో యశోదమ్మ, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సోమవారం మరికల్ మండలంలోని అన్ని గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది, మహిళా మండలి సభ్యులు ఇంటింటికీ తిరిగి ఫీవర్సర్వేను నిర్వహించారు. కొద్దిపాటి లక్షణాలు ఉన్నవారికి వెంటనే మందులు ఇవ్వడంతోపాటు తగిన సూచనలు చేస్తున్నారు. సర్వేలో సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
సర్వే ముమ్మరం
జిల్లాలో 3 మున్సిపాలిటీలు, 280 గ్రామ పంచాయతీల్లో సోమవారం ఫీవర్సర్వే ముమ్మరంగా కొనసాగింది. గ్రామ పంచాయతీల్లో 515 బృందాలు 20,971 ఇండ్లల్లో ఫీవర్ సర్వే చేపట్టి లక్షణాలు ఉన్న 230మందికి కిట్లు అందజేశారు.
అదేవిధంగా పేట, కోస్గి, మక్తల్ మున్సిపాలిటీల్లో 77 బృందాలు 4,432 ఇండ్లల్లో సర్వే చేపట్టాయి. లక్షణాలు ఉన్న 143మందికి కిట్లు అందజేశారు. జిల్లాలోని 14 ఆరోగ్య కేంద్రాల్లో అనుమానితులకు పరీక్షలు నిర్వహించి లక్షణాలు ఉన్న 91మందికి మందులకిట్లు అందజేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాంమనోహర్రావు తెలిపారు