నారాయణపేట టౌన్, నవంబర్ 29 : జిల్లాలో విద్య, గృహ రుణాలతోపాటు స్వయం ఉపాధి రుణాలను లక్ష్యం మేరకు గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష బ్యాంకర్లను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం జిల్లాస్థాయి సమన్వయం, సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. బ్యాంకుల పనితీరు, ఇచ్చిన రు ణాలు, మొండి బకాయిల వివరాలపై సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బ్యాంక ర్లు రుణాలు ఇవ్వడంలో లక్ష్యం సాధించలేకపోతున్నారని పేర్కొన్నారు. అందుకు కారణాలను అడిగి తెలుసుకున్నా రు. ముద్ర రుణాలు, ప్రధానమంత్రి నిధి, పీఎంఈజీపీ వం టి సబ్సిడీ రుణాలు ఆశించిన స్థాయిలో గ్రౌండింగ్ కావడం లేదన్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వారికి రుణం ఇవ్వడమా లేక తిరస్కరించడమా అనేది త్వరగా జరగాలని అంతే తప్ప బ్యాంకు చుట్టూ తిప్పుకోవద్దని సూచించారు. డెయిరీ, పౌల్ట్రీ, పోర్టిడ్ రైట్ వంటి స్వయం ఉపాధికి బ్యాం కర్లు సంబంధిత జిల్లా అధికారులు సమన్వయంతో పనిచే సి నిరుద్యోగ యువతకు రుణాలు ఇప్పించి ఉపాధి కల్పించాలన్నారు. సమావేశంలో నాబార్డ్ అధికారి శ్రీనివాస్, జి ల్లా అధికారులు, లీడ్ బ్యాంక్ మేనేజర్, యూనియన్ బ్యాంక్ మేనేజర్, ఆర్బీఐ అధికారులు పాల్గొన్నారు.
పనులు పరిశీలన
బుధవా రం ప్రారంభం కానున్న కొత్తపల్లి తా సిల్దార్ కార్యాలయంలో అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల ని, ప్రజలకు సేవలు అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించా రు. కొత్తపల్లి నూతనంగా ఏర్పాటు అ వుతున్న తాసిల్దార్ కార్యాలయాన్ని క లెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తని ఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 గ్రామ పంచాయతీలతో కొత్త మండలం గా కొత్తపల్లి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే కా ర్యాలయంలో కావాల్సిన ఫర్నిచర్, కంప్యూటర్, ప్రింటర్లు, రిజిస్ట్రేషన్, ఇంటర్నెట్ సదుపాయాలను అమర్చుకోవాలని సూచించారు. కొత్తగా ఏర్పాటైన మండలానికి తాసిల్దార్ను నియమించామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పద్మజారాణి, మద్దూర్ తాసిల్దార్, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.
మండలకేంద్రం తనిఖీ
గుండుమాల్ కొత్త మం డలకేంద్రం ఏర్పాటు కావడంతో అన్ని కార్యాలయాలను కలెక్టర్ శ్రీహర్ష మంగళవారం తనిఖీ చేశారు. కార్యాలయాలను బుధవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్యఅతిథిగా హా జరై ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమం లో ఎంఆర్వో మమత, ఎంపీపీ మధుకర్రావు, జెడ్పీటీసీ ప్రకాశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.